Oppo launches 4G a77 smart phone
Oppo A77 : ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ అయింది. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిది ఏ పని కావడం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే జేబులో పర్స్ అయినా మర్చిపోతారేమో కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం మర్చిపోరు. అంతలా బానిసలు అయిపోయారు ఫోన్లకి. ఇంట్లో కూర్చొని అన్నింటిని ఆన్లైన్ ద్వారా ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఫుడ్ షాపింగ్, మనీ ట్రాన్స్ఫర్ ఇలా ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ల ద్వారా చేసుకుంటున్నారు. అందుకే మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నాయి మొబైల్ కంపెనీలు. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో తాజాగా భారత్ మార్కెట్లోకి కొత్త ఫోను విడుదల చేసింది.
అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో ఏ 77 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ 4జీ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. ఇటీవల వరుసగా బడ్జెట్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని వస్తున్న ఒప్పో తాజాగా ఇలాంటి మరో ఫోను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది. ఒప్పో ఏ77లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని అందించారు. సూపర్ వూక్ చార్జర్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 5000 ఎంఏహెచ్ సామర్ధ్య ఉన్న బ్యాటరీని అందించారు. ఈ ఫోను ఐదు నిమిషాలు ఛార్జింగ్ చేస్తే మూడు గంటలపాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు.
Oppo launches 4G a77 smart phone
3.5 ఎంఎం ఆడియో జాక్ 4జీ తో పాటు వైఫై బ్లూటూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్లను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.17,999 గా ఉంది. పలు బ్యాంకుల క్రెడిట్ డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10% క్యాష్ బ్యాక్ పొందే వీలు ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ రేయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. రేయిర్ కెమెరాకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతికతను జోడించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో పనిచేసే ఈ ఫోన్ లో మైక్రో ఎస్ డి కార్డు ద్వారా 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ని పెంచుకోవచ్చు. ఈ స్పాట్ ఫోన్ శుక్రవారం నుంచి ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ తో పాటు ఒప్పో స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.