Redmi Note 12 Mobile available 10,000 in Flipkart
Redmi Note 12 Mobile ; ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అందుకే మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. మొబైల్స్ తయారు చేసే కంపెనీలు కూడా వినియోగదారులను ఆకర్షించేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను తీసుకొస్తున్నారు. అయితే తాజాగా ఇండియాలో రెడ్మీ నోట్ 12, రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో+ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. రెడ్మీ నోట్ 12 ప్రో+ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు
చేస్తే రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.ఈ ఆఫర్తో 8జీబీ+256జీబీ వేరియంట్ను రూ.25,999 కు, 12జీబీ+256జీబీ వేరియంట్ను రూ.28,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ 3000 వరకు ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్తో కొంటే రూ.10,000 లోపే ఈ స్మార్ట్ ఫోన్ ను దక్కించుకోవచ్చు.జనవరి 11 మధ్యాహ్నం 12 గంటలకు నుంచి రెడ్మీ నోట్ 12 ప్రో+ సేల్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ఫోన్లను ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్బ్యాక్ వస్తుంది. నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా కలదు. నెలకు 5000 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది.
Redmi Note 12 Mobile available 10,000 in Flipkart
ఈ స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్లో 5,000mAh బ్యాటరీ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ కలవు. 19 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ తెలిపింది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.