
Phone Tapping : ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు.... మనుగోడు ఉప ఎన్నికల్లోను ఫోన్ టాపింగ్...!
Phone Tapping : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువస్తుంది. ఇక ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు గవర్నమెంట్ అధికారులు సైతం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్ఐబి వేదికగా జరుగుతున్న ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తూ దర్యాప్తు చేపడుతున్నారు. ఫోన్ టాపింగ్ కేసులో భాగంగా ఇప్పటికే హార్డ్ డిస్క్ ధ్వంసం నుండి మొదలైన ఈ కేస్ , విపక్ష నేతల ఫోన్ టాపింగ్ , ఎన్నికల సమయంలో అధికారులు డబ్బులు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెయినాబాధ్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే కొనుగోలు కుట్ర కేసుతో ఉన్న లింకులు కూడా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం మరి కొంతమంది పోలీస్ అధికారుల మెడకు ఉచ్చుతాడు బిగించినట్లు అయింది.
అయితే 2022 నవంబర్ లో మీనాబాద్ ఫామ్ హౌస్ లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు ,రేగ కాంతారావు ,హర్షవర్ధన్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ఈ నలుగురు ఫోన్ లను ఎస్ఐబి డిఎస్పి హోదాలో ఉన్న ప్రణీత్ అండ్ కో టాపింగ్ చేయడం వలనే పట్టుబడినట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని ముందుగా బీఆర్ఎస్ సర్కార్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో పక్క ప్రణాళికతో ఆ నలుగురు ఎమ్మెల్యేతోనే ప్రధాన నిందితుడు ,నందకుమార్ ,సింహ యాజి ,రామచంద్ర భారతి లను పట్టినట్లు తెలుస్తోంది. అయితే అప్పుడు అది కొద్దిమంది అధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి.
అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా నాయకుల ఫోన్ టాప్ చేసి ఇద్దరు కానిస్టేబుల్ విన్నట్లుగా అభియోగాలు వచ్చాయి. నల్లగొండకు చెందిన ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లిఫ్ట్ చేసినట్లు సమాచారం. అయితే జిల్లాలో అప్పట్లో మాజీ ఎమ్మెల్యే సంభాషణలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లుగా సమాచారం. అంతేకాక హైదరాబాద్ రోడ్ లో ఫోన్ ట్యాప్ చేసి వినడానికి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫోన్ టాపింగ్ కేసులో మరి కొంతమంది పోలీసులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. వారిపై కూడా స్పెషల్ పోలీస్ అధికారులు నిఘా ఉంచినట్లు సమాచారం. అయితే స్పెషల్ పోలీస్ అధికారులు లిఫ్ట్ చేసిన ఆ ఇద్దరు కానిస్టేబుల్ని మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా సమాచారం
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.