Phone Tapping : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువస్తుంది. ఇక ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు గవర్నమెంట్ అధికారులు సైతం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్ఐబి వేదికగా జరుగుతున్న ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తూ దర్యాప్తు చేపడుతున్నారు. ఫోన్ టాపింగ్ కేసులో భాగంగా ఇప్పటికే హార్డ్ డిస్క్ ధ్వంసం నుండి మొదలైన ఈ కేస్ , విపక్ష నేతల ఫోన్ టాపింగ్ , ఎన్నికల సమయంలో అధికారులు డబ్బులు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెయినాబాధ్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే కొనుగోలు కుట్ర కేసుతో ఉన్న లింకులు కూడా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం మరి కొంతమంది పోలీస్ అధికారుల మెడకు ఉచ్చుతాడు బిగించినట్లు అయింది.
అయితే 2022 నవంబర్ లో మీనాబాద్ ఫామ్ హౌస్ లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు ,రేగ కాంతారావు ,హర్షవర్ధన్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ఈ నలుగురు ఫోన్ లను ఎస్ఐబి డిఎస్పి హోదాలో ఉన్న ప్రణీత్ అండ్ కో టాపింగ్ చేయడం వలనే పట్టుబడినట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని ముందుగా బీఆర్ఎస్ సర్కార్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో పక్క ప్రణాళికతో ఆ నలుగురు ఎమ్మెల్యేతోనే ప్రధాన నిందితుడు ,నందకుమార్ ,సింహ యాజి ,రామచంద్ర భారతి లను పట్టినట్లు తెలుస్తోంది. అయితే అప్పుడు అది కొద్దిమంది అధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి.
అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా నాయకుల ఫోన్ టాప్ చేసి ఇద్దరు కానిస్టేబుల్ విన్నట్లుగా అభియోగాలు వచ్చాయి. నల్లగొండకు చెందిన ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లిఫ్ట్ చేసినట్లు సమాచారం. అయితే జిల్లాలో అప్పట్లో మాజీ ఎమ్మెల్యే సంభాషణలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లుగా సమాచారం. అంతేకాక హైదరాబాద్ రోడ్ లో ఫోన్ ట్యాప్ చేసి వినడానికి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫోన్ టాపింగ్ కేసులో మరి కొంతమంది పోలీసులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. వారిపై కూడా స్పెషల్ పోలీస్ అధికారులు నిఘా ఉంచినట్లు సమాచారం. అయితే స్పెషల్ పోలీస్ అధికారులు లిఫ్ట్ చేసిన ఆ ఇద్దరు కానిస్టేబుల్ని మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా సమాచారం
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.