Congress : బి.ఆర్.ఎస్ మరో వికెట్ నెక్స్ట్ జంపింగ్ కి ఆయన రెడీ. సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ చేస్తున్న కాంగ్రెస్..!
Congress : తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే బి.ఆర్.ఎస్ నుంచి గెలిచిన అభ్యర్ధులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా మరికొందరు కూడా అదే దారిలో వెళ్తున్నారు. అధికారం రాగానే ప్రతి పక్షం లో ఉన్న వారు అధికార పార్టీలోకి చేరడం ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలో తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే బి.ఆర్.ఎస్ నుంచి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె య్దయ్య, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. నెక్స్ట్ బి.ఆర్.ఎస్ లో పడే వికెట్ ఎవరిది అని చర్చ మొదలైంది. ఐతే ఈ క్రమంలో బి.ఆర్.ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరే లిస్ట్ లో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన జెడ్పీ చైర్ పసన్ పదవికాలం ముగియడం వల్ల ఆయనకు లైన్ క్లియర్ కాగా ఇన్నాళ్లు ఆయన వల్లే పార్టీ మారలేదని తెలుస్తుంది.
కాంగ్రెస్ లోకి చేరేందుకు కృష్ణ మోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తుంది. ఐతే ఆయన మాత్రం ఈ విషయం పట్ల చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. పర్టీ మారడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అంటున్నారు. ఐతే ఇప్పటివరకు బి.ఆర్.ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరగా వాళ్లు కూడా చివరి నిమిషం వరకు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు.
Congress : బి.ఆర్.ఎస్ మరో వికెట్ నెక్స్ట్ జంపింగ్ కి ఆయన రెడీ. సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ చేస్తున్న కాంగ్రెస్..!
ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా అలానే కాంగ్రెస్ లోకి చేరే వరకు అంతా సైలెంట్ గా కానిస్తున్నారని తెలుస్తుంది. మరి కృష్ణమోహన్ రెడ్డి తో పాటుగా ఆయన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. బి.ఆర్.ఎస్ ను ఖాళీ చేసే దిశగా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఐతే ఎమ్మెల్యేల జంపులపై గులాబి అధినేత కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఎమ్మెల్యేలను ఎంతగా ఆపాలని ప్రయత్నిస్తున్నా కె.సి.ఆర్ ని కాదని కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని తెలుస్తుంది.
JC Prabhakar Reddy : వైసీపీ Ysrcp అధినేత జగన్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంతపురం జిల్లాకు చెందిన,…
Thalliki Vandanam Scheme : కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు…
Ration Shops : ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రేషన్ దుకాణాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం సహా అనేక ప్రాంతాల్లో రేషన్ డిపోల వద్ద…
Heroine : తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించిన హీరోయిన్ అమలా పాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
AP Government : ఏపీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. ఖరీఫ్ పంట బీమా పథకానికి రూ.132.58 కోట్ల…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న “దీపం-2” పథకంలో ముఖ్యమైన మార్పు చేపట్టింది.…
Belly Fat Melts Away : మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో ఆరోగ్యకరమైన డ్రింక్ తయారు చేసుకోవచ్చని తెలుసా?…
Today Gold Rate : జూన్ 1న బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
This website uses cookies.