Crop Loan Waive : తెలంగాణ రైతు రుణమాఫీ పై తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టులో 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఆగస్టు కంటే ముందుగానే రైతు రుణమాఫీ చేస్తామని దానిని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రజాభిప్రాయం సేకరించి విధివిధానాలు రూపొందించిన తర్వాత అసెంబ్లీలో రైతు భరోసా పై చర్చలు అమలు చేస్తామని బట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు గా రైతు భరోసా ఇవ్వమని చెప్పరు. రైతులతో మాట్లాడి విధివిధానాలను రూపొందిస్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కోమాటిరెడ్డి , వెంకటరెడ్డి పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిపారు. అదే విధంగా గత ప్రభుత్వ పాలనలో మిషన్ భగీరథ పేరుతో 42 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క ఆరోపించడం జరిగింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి మంచినీళ్లు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం కొత్తగూడెంలో 125 కోట్లతో పనులు ఎందుకు చేపడతామని బట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేరుస్తామని రాష్ట్ర ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటామని మట్టి చెప్పారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో ధర్మల్ పవర్ ప్లాంట్ ను రామగుండంలో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసామని త్వరలోనే ప్రజలకి శుభవార్త వింటారు అని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తామని అన్నారు. వాటితో పాటుగా ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతామని చెప్పారు. ఇక పాలవంచ కొత్తగూడెం రెండు పట్టణాలు కలిపితే కార్పొరేషన్ ఏర్పాటు తో పాటు స్థానికంగా ఐటి హబ్ ఏర్పాటు చేసే ఆలోచనల ప్రభుత్వం ఉంది అని పేర్కొన్నారు.
రైతుబంధు ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని చెడు ప్రచారాలు జరిగాయని కాని రైతుల ఖాతాలో ఒకేసారి 7500 కోట్లు జమ చేసామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పంట సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వమని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయం పై అన్నదాతల అభిప్రాయాలను తీసుకుంటున్నామని ఆలస్యం జరిగిన రైతులకు మేలు చేస్తామని తెలిపారు . గత ప్రభుత్వ పాలనలో 9 వేల కోట్లల రూపాయలను ఖర్చు చేసిన ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. గతంలొ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పేర్లు మార్చి డబ్బుని దోచుకున్నారని ఆరోపించారు పొంగులేటి. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో వెళ్లేలా ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి గడ్కరి ఆదేశాలతో సెప్టెంబర్ లో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.