News

Telangana : తెలంగాణా కి బంపర్ గుడ్ న్యూస్ .. కేంద్రం భారీ ప్రకటన !

By Ramu Tandu Ramalingaiah

Telangana : తెలంగాణ పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రోత్సాహం అందించింది. ఇప్పటికే జాతీయ రహదారులు, రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం, ఇప్పుడు పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన కింద తెలంగాణలో తొలి విడతగా నాలుగు ఆధునిక పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పడటంతో పాటు అనుబంధ వ్యాపారాలు, సేవా రంగాలకూ ఊతం లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Telangana : తెలంగాణా కి బంపర్ గుడ్ న్యూస్ .. కేంద్రం భారీ ప్రకటన !

Telangana నాలుగు ప్రాంతాల్లో తొలి విడత పారిశ్రామిక పార్కులు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తొలి దశలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, ఘట్‌కేసర్ మండలం మాదారం, చౌటుప్పల్ మండలం దండు మైలారం ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ నాలుగు పార్కుల కోసం సమగ్ర డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేసి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులు ఆమోదం పొందిన తర్వాత మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు పనులు దశలవారీగా ప్రారంభం కానున్నాయి.పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలోని మరో 16 ప్రాంతాల్లో కూడా కొత్త ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ అధికారులకు ఆదేశించారు. దీంతో పరిశ్రమలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇతర జిల్లాలకు కూడా విస్తరించే అవకాశాలు మెరుగుపడనున్నాయి.

Advertisement

ఉపాధి, రైతులకు లాభం.. చక్కెర పరిశ్రమలపై కూడా దృష్టి

కొత్త పారిశ్రామిక పార్కుల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. తయారీ రంగం అభివృద్ధి చెందడంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా వేగంగా విస్తరించే అవకాశముంది.ఇదే సమావేశంలో రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ అంశంపైనా విస్తృతంగా చర్చించారు. చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో చెరుకు రైతులకు, చక్కెర కర్మాగారాలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.

చెరుకు రైతులకు మెరుగైన ఆదాయం అందేలా, నిలిచిపోయిన చక్కెర పరిశ్రమలకు పునర్జీవం పోసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల బలోపేతం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే తెలంగాణలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి మరింత వేగం అందుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Latest Posts

Related Posts