
change the half day schools timing ..!
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల వడగాల్పులు వీస్తుండగా ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల తర్వాత బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. వాతావరణ శాఖ కూడా రానున్న రోజుల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేస్తోంది.
change the half day schools timing ..!
వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికే ఒంటిపూట బడులను అమలు చేస్తోంది. మార్చి 16 నుంచి ఈ విధానం కొనసాగుతుండగా ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసులు కొనసాగిస్తున్నాయి. అయితే బడి ముగిసే సమయానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు వేడి తట్టుకోలేక అలసటకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలో రాగిజావ ఇవ్వడం తరగతులు ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థులు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటమే ప్రధాన సమస్యగా మారింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వం వద్ద కొత్త డిమాండ్లు చేస్తున్నారు. ఒంటిపూట బడుల సమయాన్ని మరింత తగ్గించాలని కోరుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటలకే పాఠశాలలు ముగించాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ సూచించింది. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించబడ్డాయి. ఇప్పటికే పలు పాఠశాలల్లో పరీక్షలు జరుగుతుండగా పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కూడా కొనసాగుతోంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఒంటిపూట బడుల సమయాల్లో మార్పులు చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారిక నిర్ణయం కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
This website uses cookies.