Categories: NewspoliticsTelangana

CM Revanth Reddy : కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు… నిజంగా కేసీఆర్ కు సిగ్గు లేదు…!

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చిందని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు సరైన సమయానికి రైతుల ఖాతాలలో చేరేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది చేతకావడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చిందంటూ విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ను తిట్టడం తప్ప మరో పని లేదని పేర్కొన్నారు.

నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చిందా అనేది వచ్చే జూలై నెల నుండి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా లేదా ,లేక కాంగ్రెస్ వలన ప్రకృతి పగ పట్టిందా అనే లెక్క అప్పుడు తెలుస్తది. మేము అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదు. అది చేయలేదు ఇది చేయలేదని విమర్శలు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఖాతాలో రైతుబంధు 10 రోజుల్లో వేసామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ నిజంగా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో డిసెంబర్ లో మొదలుపెడితే సెప్టెంబర్ వరకు అంటే దాదాపు 10 నెలల వరకు రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో వేసిన లెక్కలు ఉన్నాయి.కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇక అసెంబ్లీలో అవన్నీ బయటపెడదామంటే నువ్వు రాకుండా పారిపోయావు అంటూ కేసిఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

2018 ఎన్నికల్లో మాత్రమే రైతుబంధు సరైన సమయానికి ఇచ్చారు. ఆ తర్వాత నుండి ప్రతిసారి కూడా రైతుబంధు వేయడానికి కనీసం నాలుగు నెలల సమయం తీసుకున్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 64 లక్షల 75 వేల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు వేసాము అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నది 69 లక్షల మంది ఖాతాలు. దీనిలో ఇప్పటికే 64 లక్షలు మందికి డబ్బు చేరడం జరిగింది. ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే. నేను కేసీఆర్ కి సూటిగా సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే వచ్చి ఈ లెక్కలలో తప్పు ఉంటే నిజం కాదని నిరూపించాల్సిందిగా కోరుతున్నానంటూ కెసిఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago