CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చిందని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు సరైన సమయానికి రైతుల ఖాతాలలో చేరేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది చేతకావడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చిందంటూ విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ను తిట్టడం తప్ప మరో పని లేదని పేర్కొన్నారు.
నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చిందా అనేది వచ్చే జూలై నెల నుండి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా లేదా ,లేక కాంగ్రెస్ వలన ప్రకృతి పగ పట్టిందా అనే లెక్క అప్పుడు తెలుస్తది. మేము అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదు. అది చేయలేదు ఇది చేయలేదని విమర్శలు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఖాతాలో రైతుబంధు 10 రోజుల్లో వేసామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ నిజంగా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో డిసెంబర్ లో మొదలుపెడితే సెప్టెంబర్ వరకు అంటే దాదాపు 10 నెలల వరకు రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో వేసిన లెక్కలు ఉన్నాయి.కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇక అసెంబ్లీలో అవన్నీ బయటపెడదామంటే నువ్వు రాకుండా పారిపోయావు అంటూ కేసిఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
2018 ఎన్నికల్లో మాత్రమే రైతుబంధు సరైన సమయానికి ఇచ్చారు. ఆ తర్వాత నుండి ప్రతిసారి కూడా రైతుబంధు వేయడానికి కనీసం నాలుగు నెలల సమయం తీసుకున్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 64 లక్షల 75 వేల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు వేసాము అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నది 69 లక్షల మంది ఖాతాలు. దీనిలో ఇప్పటికే 64 లక్షలు మందికి డబ్బు చేరడం జరిగింది. ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే. నేను కేసీఆర్ కి సూటిగా సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే వచ్చి ఈ లెక్కలలో తప్పు ఉంటే నిజం కాదని నిరూపించాల్సిందిగా కోరుతున్నానంటూ కెసిఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.