Home » News » Gutta Sukhender Reddy Comments On Free Schemes
News

Gutta Sukhender Reddy : ఉచిత పథకాలపై గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 21, 2025, 8:00 pm
Advertisement

Gutta Sukhender Reddy : తెలంగాణ Telangana శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ నాయకుల మాటల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష ప్రజలను చీదరించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి తగిన విషయమేమీ కాదన్నారు. ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకుని, పార్టీలకతీతంగా తమ మాటల్లో ఆచరణం పాటించాలని సూచించారు. అలా చేస్తే మాత్రమే నాయకుల గౌరవం నిలబడుతుందని అన్నారు.

Advertisement

Gutta Sukhender Reddy : ఉచిత పథకాలపై గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Gutta Sukhender Reddy : ఉచిత పథకాల వల్ల రాష్ట్రం, దేశ ఆర్థిక వ్యవస్థలపై పెను భారం పడుతుంది – గుత్తా

అదే సందర్భంలో ఆయన ఉచిత పథకాలపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉచిత పథకాల వల్ల రాష్ట్రం, దేశ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర భారం పడుతోందని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిబంధనలు లేకుండా ఇస్తున్న ఉచితాలు భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని నాశనం చేయవచ్చని హెచ్చరించారు. అలాగే, ఎన్నికల సమయంలో ఖర్చులపై నియంత్రణ లేకపోవడమే అవినీతి పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేయడానికి సుప్రీంకోర్టు మరియు ఎన్నికల సంఘం జోక్యం అవసరమని అన్నారు.

Advertisement

ఇక బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై కూడా ఆయన స్పందించారు. ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని గంభీరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాయకుల మధ్య పరస్పర దాడులు, విమర్శలు మంచివి కావని, ఇలాంటి వ్యవహారాలు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు కలిగించతాయని అన్నారు. సభ వెలుపల జరుగుతున్న సభ్యుల మధ్య దాడులపై చట్టం తనదైన రీతిలో చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి