Gutta Sukhender Reddy : ఉచిత పథకాలపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Gutta Sukhender Reddy : తెలంగాణ Telangana శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ నాయకుల మాటల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష ప్రజలను చీదరించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి తగిన విషయమేమీ కాదన్నారు. ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకుని, పార్టీలకతీతంగా తమ మాటల్లో ఆచరణం పాటించాలని సూచించారు. అలా చేస్తే మాత్రమే నాయకుల గౌరవం నిలబడుతుందని అన్నారు.
Gutta Sukhender Reddy : ఉచిత పథకాలపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
అదే సందర్భంలో ఆయన ఉచిత పథకాలపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉచిత పథకాల వల్ల రాష్ట్రం, దేశ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర భారం పడుతోందని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిబంధనలు లేకుండా ఇస్తున్న ఉచితాలు భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని నాశనం చేయవచ్చని హెచ్చరించారు. అలాగే, ఎన్నికల సమయంలో ఖర్చులపై నియంత్రణ లేకపోవడమే అవినీతి పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేయడానికి సుప్రీంకోర్టు మరియు ఎన్నికల సంఘం జోక్యం అవసరమని అన్నారు.
ఇక బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై కూడా ఆయన స్పందించారు. ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని గంభీరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాయకుల మధ్య పరస్పర దాడులు, విమర్శలు మంచివి కావని, ఇలాంటి వ్యవహారాలు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు కలిగించతాయని అన్నారు. సభ వెలుపల జరుగుతున్న సభ్యుల మధ్య దాడులపై చట్టం తనదైన రీతిలో చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు…
Anand : జగపతి బాబు Jagapathi babu, సౌందర్య, మహేశ్వరి నటించిన ‘ప్రియరాగాలు’ సినిమాలో సౌందర్య కుమారుడిగా ఆకట్టుకున్న ఆ…
Magnesium Oil : కొంతమందికి పడుకోగానే నిద్ర పట్టదు. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఇంకా మలబద్ధక సమస్యలతో ఇబ్బంది…
Blue Tea : ప్రకృతి ఇచ్చే మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కొన్ని పండ్లు,ఆకులు ఆయుర్వేద మూలికల్లో ఉపయోగిస్తే,పుష్పాలను…
Vastu Tips : చాలామంది ఇళ్లల్లో పెరట్లో బొప్పాయి చెట్లను పెంచుకోవడం చేస్తూనే ఉంటాం. కొందరి అవంతటికవే బొప్పాయి చెట్లు…
Harish Rao : ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేవి ..కానీ ఇప్పుడు ఏపీలో…
Nitish kumar Reddy: టీమిండియాకు Team India vs England ఇంగ్లండ్తో కీలకమైన టెస్టు సిరీస్లో ముందు పెద్ద దెబ్బ…
Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం రాత్రి స్పెషల్ ఇన్వెస్టిగేషన్…
This website uses cookies.