
Hyderabad : హైదరాబాదీలు జర జాగ్రత్త.. మీ జేబులకి చిల్లు వేసేందుకు రెడీ అయిన పోలీసులు..!
Hyderabad : హైదరాబాద్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో ఈ నెల 5వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.కఠినంగా నిబంధనలు అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడపడం, రాంగ్ రూట్ లో వెళ్లడం వంటి చేస్తే భారీ జరిమానా విధించనున్నారు. గతంలో హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.100 ఫైన్ వేసేవారు. ఇప్పడు ఆ జరిమానాను 100 శాతం పెంచారు.
అంటే ఇక నుంచి వితౌట్ హెల్మెట్ తో వాహనం నడిపితే రూ.200 ఫైన్ విధించాలని నిర్ణయించారు. రూ.35 ఛార్జీలు కూడా ఉండనున్నాయి. రాంగ్ రూట్లో వెళ్తే.. ఇక అంతే సంగతి. రాంగ్ రూట్లో వెళ్తే భారీగా జరిమానా విధించనున్నారు. రూ.2000 ఫైన్ విధించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి తోడు రూ.35 ఛార్జీలు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ అధికారి విశ్వప్రసాద్ ఆదేశాల జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే మోటర్ వెహికల్ చట్టం ప్రకారం గరిష్ఠంగా జరిమానా విధించాల్సి వస్తుందన్నారు. అలాగే హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపేవారు, రాంగ్ రూట్లో వెళ్లే వారికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
Hyderabad : హైదరాబాదీలు జర జాగ్రత్త.. మీ జేబులకి చిల్లు వేసేందుకు రెడీ అయిన పోలీసులు..!
హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల గత 3 రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ తెలిపారు.ఇక నుంచి మీరు హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.235 చెల్లించాల్సిందే. ఇక రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే రూ.2035 కట్టాల్సిందే. గతంలో రాంగ్ రూట్లో వెళ్తే రూ.1000 జరిమానా విధించే వారు. కొన్ని సందర్భాల్లో కోర్టుకు కూడా హాజరు పరిచేవారు.రాంగ్ రూట్ వెళ్లి చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ చాలా మంది రాంగ్ రూట్ లో వెళ్తున్నారు.ఈ క్రమంలోనే పోలీసులు కఠిన శిక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.