
jayaprakash narayana comments on congress party
Jaya Prakash Narayana : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ముఖ్య కారణం 6 గ్యారెంటీ హామీలే అని తెలుస్తోంది. 6 గ్యారెంటీ హామీలు అమలు అనేది మామూలు విషయం కాదు.. వేల కోట్లు కావాలి.. ఆ హామీలు అమలు చేయడానికి. మరి.. నిజంగానే ఆ 6 గ్యారెంటీ హామీలు అమలు చేసేంత డబ్బు ప్రభుత్వం వద్ద ఉందా? అసలు ఇవి అమలు సాధ్యమయ్యే హామీలేనా.. అనే దానిపై తాజాగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఖచ్చితంగా ఒక విషయంలో జాగ్రత్త వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే సంవత్సరానికి రూ.70 వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టాల్సి వస్తుంది అని అన్నారు.
ఇప్పటికే 50 వేల కోట్ల పైచిలుకు ఖర్చు అవుతోంది. రుణ మాఫీకి రూ.2,70,000 కోట్లు వెచ్చించాలి. దళిత బంధు కింద కూడా వేల కోట్ల నిధులు కావాలి. ఇలా డబ్బులు పంచడం కరెక్ట్ కాదని నేను ముందే చెప్పను కానీ.. వినలేదు అని జేపీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పథకాలను కొన్నింటిని తీసేయకుండా వాటిని కొనసాగిస్తామని.. ఇంకా ఇచ్చే సాయం కూడా పెంచారు. దళిత బంధుకే సంవత్సరానికి రూ.50 వేలు అవుతుంది. మొత్తం కలిపితే రూ.1,20,000 కోట్లు అదనపు ఖర్చు కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. వీటిలో ఆచరణ సాధ్యం అయినవి.. చేయండి.. ఆచరణ సాధ్యం కానివి చేయకండి అని జేపీ చెప్పారు. 2022-23 లెక్కలు తీసుకుంటే రూ.1,72,000 కోట్ల రెవెన్యూ వ్యయం అంటే రోజువారి ఖర్చు అవుతోంది. దానిపై అదనంగా రూ.1,20,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే అది సాధ్యం కాదు.
అప్పు తెస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఖచ్చితంగా సంక్షేమం అవసరం కానీ.. సంక్షేమమే పాలన, అభివృద్ధి వద్దు అంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే. ఓపీఎస్ వల్ల గెలుస్తామనే పిచ్చి ఆలోచన వద్దు. ప్రభుత్వ ఉద్యోగులు 3 శాతమే. వాళ్ల కోసం ఇష్టం ఉన్నట్టుగా హామీలు ఇవ్వకండి. పాత పద్ధతి కాదు.. కొత్త పద్ధతి ద్వారా చేయండి. ఎన్నికల్లో భయంతో ఎలాగైనా గెలవాలనే కోరికతో రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తున్నారు. లేకపోతే పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రం చాలా సమస్యల్లో పడబోతోందన్నారు. ఆర్థికంగా మనమే నష్టపోనున్నాం. ఆర్థికాభివృద్ధి జరగదు అని జేపీ స్పష్టం చేశారు.
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
Wealth Temples : జీవితంలో సంపద, స్థిరత్వం ప్రతి ఒక్కరి కల. కానీ ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడం, అప్పులు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
This website uses cookies.