
Markapuram bus accident.. Shocking facts
Markapuram : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం అందరినీ కలచివేసింది. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రయాణికుల బస్సు ఒక టిప్పర్ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనం కాగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు అక్కడి దృశ్యాలు ఎంతో భీతిగొల్పేలా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు పరిస్థితి సరిగా లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు.
Markapuram bus accident.. Shocking facts
ప్రమాదానికి గంట ముందు నుంచే బస్సు ట్రబుల్ ఇచ్చిందని దాంతో దాదాపు గంటపాటు నిలిపివేసి రిపేర్లు చేసిన తర్వాత ప్రయాణం ప్రారంభించారని తెలిపారు. అయితే కొద్ది సేపటికే ఈ ఘోరం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ ఒక గంట ప్రయాణం కూడా సురక్షితంగా సాగి ఉంటే తమ వారు బ్రతికేవారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక బస్సు ఫిట్నెస్పై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం సంక్రాంతి సందర్భంగా ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బస్సు కండీషన్ బాగోలేదని గుర్తించి రూ.36 వేల జరిమానా విధించినట్లు సమాచారం. అయినప్పటికీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇచ్చిన యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారి తీసిందని బాధితులు మండిపడుతున్నారు.
ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. గత ఏడాది అక్టోబర్లో కర్నూల్ జిల్లా లో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఇంకా ప్రజల మదిలో తాజాగానే ఉంది. ఆ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సీటింగ్ బస్సుకు అనుమతి తీసుకుని అక్రమంగా స్లీపర్గా మార్చడం వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులు బయటపడలేకపోయారు. ఇప్పుడు మార్కాపురం ఘటనలోనూ అదే తరహా నిర్లక్ష్యం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల పర్యవేక్షణ వంటి అంశాల్లో సరైన నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే స్పందించకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టినప్పుడే ఇటువంటి విషాదాలకు చెక్ పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mother : లోకంలో ఏ బంధమైనా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తుందేమో కానీ, అమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడూ నిస్వార్థంగానే…
Teacher : చదువు పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంచడం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా, వ్యక్తిగతంగా కొంతమంది…
CM Vijay : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది.…
BJP Telangana : భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఎన్నికల మూడ్లోనే ఉంటుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ పార్టీ…
Cucumber Face Packs : కీరదోస కేవలం ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఒక వరప్రసాదం. ఇందులో విటమిన్…
Therali Kudumulu : మనం నిత్యం చేసుకునే పిండి వంటల కంటే భిన్నంగా, ఆరోగ్యానికి మేలు చేస్తూ, రుచిలో సాటిలేని…
IPL Ticket Scam : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ అభిమానులకు ఎంతటి వినోదాన్ని పంచుతుందో, అదే…
Tamil Nadu CM Vijay : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. 'తమిళగ వెట్రి…
Beetroot Juice : బీట్రూట్లో విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, ప్రతి ఒక్కరి శరీరం…
Venu Swamy Vijay TVK : టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్స్ జాతకాలను విశ్లేషిస్తూ ఎప్పుడూ చర్చల్లో ఉండే వేణుస్వామి,…
Vijay TVK : తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK),…
Ravi Babu Razor Movie Review : రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కెమెరా యాంగిల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే…
This website uses cookies.