
Markapuram bus accident.. Shocking facts
Markapuram : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం అందరినీ కలచివేసింది. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రయాణికుల బస్సు ఒక టిప్పర్ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనం కాగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు అక్కడి దృశ్యాలు ఎంతో భీతిగొల్పేలా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు పరిస్థితి సరిగా లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు.
Markapuram bus accident.. Shocking facts
ప్రమాదానికి గంట ముందు నుంచే బస్సు ట్రబుల్ ఇచ్చిందని దాంతో దాదాపు గంటపాటు నిలిపివేసి రిపేర్లు చేసిన తర్వాత ప్రయాణం ప్రారంభించారని తెలిపారు. అయితే కొద్ది సేపటికే ఈ ఘోరం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ ఒక గంట ప్రయాణం కూడా సురక్షితంగా సాగి ఉంటే తమ వారు బ్రతికేవారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక బస్సు ఫిట్నెస్పై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం సంక్రాంతి సందర్భంగా ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బస్సు కండీషన్ బాగోలేదని గుర్తించి రూ.36 వేల జరిమానా విధించినట్లు సమాచారం. అయినప్పటికీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇచ్చిన యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారి తీసిందని బాధితులు మండిపడుతున్నారు.
ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. గత ఏడాది అక్టోబర్లో కర్నూల్ జిల్లా లో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఇంకా ప్రజల మదిలో తాజాగానే ఉంది. ఆ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సీటింగ్ బస్సుకు అనుమతి తీసుకుని అక్రమంగా స్లీపర్గా మార్చడం వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులు బయటపడలేకపోయారు. ఇప్పుడు మార్కాపురం ఘటనలోనూ అదే తరహా నిర్లక్ష్యం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల పర్యవేక్షణ వంటి అంశాల్లో సరైన నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే స్పందించకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టినప్పుడే ఇటువంటి విషాదాలకు చెక్ పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Shakepet : హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్…
Lockdown In India : కరోనా మహమ్మారి సృష్టించిన లాక్డౌన్ కష్టాలను దేశ ప్రజలు ఇంకా మర్చిపోకముందే, ఇప్పుడు మరో…
Maddur : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మార్గదర్శకులుగా నిలవాల్సిన ఒక ఉపాధ్యాయుడు, తన బాధ్యతలను విస్మరించి బాలిక పట్ల అసభ్యంగా…
Samsung Galaxy A Series : స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరోసారి తన సత్తాను చాటుతూ Samsung తన కొత్త గెలాక్సీ…
Central Govt : కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.…
New Rules : భారతదేశంలో ఉపాధి రంగం మరియు ఆదాయపు పన్ను వ్యవస్థలో ఏప్రిల్ 1, 2026 నుండి కీలక…
PM Kisan Yojana : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన…
Gold Silver Rates 26 March 2026 Today : గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు…
Karthika Deepam 2 March 26th 2026 Latest Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం…
Chicken : ఇప్పటి వరకు మార్కెట్లో మటన్ అధిక ధరకు అమ్ముడవుతుండటం మనం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు కోళ్లలో…
Tea-biscuit : చాలా మంది బిస్కెట్లు హానికరం కావని భావిస్తూ వాటిని రోజువారీ ‘హెల్తీ స్నాక్’గా తీసుకుంటుంటారు. కానీ తాజా…
Diabetes Medicine : బరువు తగ్గాలని ఆశపడుతున్నవారికి, షుగర్ సమస్యతో బాధపడుతున్నవారికి ఊరటనిచ్చే శుభవార్త అందింది. ఇప్పటి వరకు అధిక…
This website uses cookies.