Categories: NewsTelangana

Markapuram : మార్కాపురం బస్సు ప్రమాదం .. వెలుగులోకి విస్తుపోయే విషయాలు ..!

Advertisement
Published by
Advertisement

Markapuram : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం అందరినీ కలచివేసింది. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రయాణికుల బస్సు ఒక టిప్పర్‌ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనం కాగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు అక్కడి దృశ్యాలు ఎంతో భీతిగొల్పేలా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు పరిస్థితి సరిగా లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు.

Advertisement

Markapuram bus accident.. Shocking facts

ప్రమాదానికి గంట ముందు నుంచే బస్సు ట్రబుల్ ఇచ్చిందని దాంతో దాదాపు గంటపాటు నిలిపివేసి రిపేర్లు చేసిన తర్వాత ప్రయాణం ప్రారంభించారని తెలిపారు. అయితే కొద్ది సేపటికే ఈ ఘోరం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ ఒక గంట ప్రయాణం కూడా సురక్షితంగా సాగి ఉంటే తమ వారు బ్రతికేవారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక బస్సు ఫిట్‌నెస్‌పై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం సంక్రాంతి సందర్భంగా ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బస్సు కండీషన్ బాగోలేదని గుర్తించి రూ.36 వేల జరిమానా విధించినట్లు సమాచారం. అయినప్పటికీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇచ్చిన యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారి తీసిందని బాధితులు మండిపడుతున్నారు.

Advertisement

ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. గత ఏడాది అక్టోబర్‌లో కర్నూల్ జిల్లా లో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఇంకా ప్రజల మదిలో తాజాగానే ఉంది. ఆ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సీటింగ్ బస్సుకు అనుమతి తీసుకుని అక్రమంగా స్లీపర్‌గా మార్చడం వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులు బయటపడలేకపోయారు. ఇప్పుడు మార్కాపురం ఘటనలోనూ అదే తరహా నిర్లక్ష్యం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల పర్యవేక్షణ వంటి అంశాల్లో సరైన నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే స్పందించకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టినప్పుడే ఇటువంటి విషాదాలకు చెక్ పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Shakepet : గ్యాస్ సిలిండర్లపై ఉద్రిక్తత .. సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వినియోగదారులు ..!

Shakepet : హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్…

10 minutes ago

Lockdown In India : దేశంలో మళ్లీ లాక్‌డౌన్? ‘ఎనర్జీ లాక్‌డౌన్’ అంటే ఏంటో తెలుసా?

Lockdown In India : కరోనా మహమ్మారి సృష్టించిన లాక్‌డౌన్ కష్టాలను దేశ ప్రజలు ఇంకా మర్చిపోకముందే, ఇప్పుడు మరో…

51 minutes ago

Maddur : పాఠశాలలో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన .. విద్యార్థి సంఘాల ఆగ్రహం

Maddur : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మార్గదర్శకులుగా నిలవాల్సిన ఒక ఉపాధ్యాయుడు, తన బాధ్యతలను విస్మరించి బాలిక పట్ల అసభ్యంగా…

3 hours ago

Samsung Galaxy A Series : అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న .. సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ A57 5G, A37 5G ఫోన్లు విడుదల

Samsung Galaxy A Series : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి తన సత్తాను చాటుతూ Samsung తన కొత్త గెలాక్సీ…

3 hours ago

Central Govt : మోడీ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ .. ఆధార్ కార్డు ఉంటే చాలు .. ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు ..వివరాలివే ..!

Central Govt : కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.…

4 hours ago

New Rules : ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ..ఉద్యోగులు తెలుసుకోవాల్సిన కొత్త మార్పులు ఇవే ..!

New Rules : భారతదేశంలో ఉపాధి రంగం మరియు ఆదాయపు పన్ను వ్యవస్థలో ఏప్రిల్ 1, 2026 నుండి కీలక…

5 hours ago

PM Kisan Yojana : పీఎం కిసాన్ స్కీమ్‌పై కేంద్రం బిగ్ అప్‌డేట్ .. రైతుల అకౌంట్లలోకి భారీగా డబ్బులు జమ.. !

PM Kisan Yojana : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన…

6 hours ago

Karthika Deepam 2 March 26th 2026 Latest Episode : జ్యోత్స్నకు దశరథ దిమ్మతిరిగే షాక్.. వీలునామా మార్పుతో తలపట్టుకున్న పారిజాతం!

Karthika Deepam 2 March 26th 2026 Latest Episode : స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం…

8 hours ago

Chicken : మటన్‌కి మించిన ధర .. ఈ కోడి మాంసం కోసంకు పెరుగుతున్న డిమాండ్‌ .. ప్రత్యేకతలు తెలిస్తే ఇక వదలరు ..!

Chicken : ఇప్పటి వరకు మార్కెట్లో మటన్‌ అధిక ధరకు అమ్ముడవుతుండటం మనం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు కోళ్లలో…

9 hours ago

Tea-biscuit : టీ తోపాటు బిస్కెట్లు కూడా తీసుకుంటున్నారా?.. అయితే ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!

Tea-biscuit : చాలా మంది బిస్కెట్లు హానికరం కావని భావిస్తూ వాటిని రోజువారీ ‘హెల్తీ స్నాక్’గా తీసుకుంటుంటారు. కానీ తాజా…

10 hours ago

Diabetes Medicine : షుగర్ పేషెంట్లకు ఊరటనిచ్చే శుభవార్త .. భారీగా తగ్గిన డయాబెటిస్ మెడిసిన్ ధర ..!

Diabetes Medicine : బరువు తగ్గాలని ఆశపడుతున్నవారికి, షుగర్ సమస్యతో బాధపడుతున్నవారికి ఊరటనిచ్చే శుభవార్త అందింది. ఇప్పటి వరకు అధిక…

11 hours ago