
palakurthy jhansi reddy talks about errabelli dayakar rao
Jhansi Reddy VS Errabelli : తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. పాలకుర్తి నియోజకవర్గం రాజకీయాలు ఇప్పుడు ఇంకో ఎత్తులా మారాయి. నిజానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా అక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగానే ఉంది. కానీ.. ఎప్పుడైతే ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి అక్కడ అడుగుపెట్టిందో అప్పటి నుంచి రాజకీయాలు మొత్తం మారిపోయాయి. మామూలుగా కాదు.. రాజకీయాలు చాలా వేడెక్కాయి. తనకు భారత పౌరసత్వం లేదని తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో తన కోడలుకు ఇవ్వాలని పట్టుబట్టి మరీ తన కోడలు యశస్విని రెడ్డికి టికెట్ వచ్చేలా చేసింది ఝాన్సీ రెడ్డి. అంతే కాదు.. తన యూఎస్ లో రియల్ ఎస్టేట్ చేస్తూ వేల కోట్లు సంపాదించినట్టు తెలుస్తోంది. ఆ డబ్బును ఇక్కడ కుమ్మరించి ఈసారి ఎలాగైనా ఎర్రబెల్లిని ఓడించి తన సత్తా చాటాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది ఝాన్సీ రెడ్డి. అందులో భాగంగానే ఝాన్సీ రెడ్డి తన కోడలుతో చాలా బలంగా ప్రచారం చేయిస్తోంది. ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కోసం ఝాన్సీ రెడ్డికి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి.
తాజాగా పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఝాన్సీ రెడ్డి ఎర్రబెల్లిపై మండిపడ్డారు. నా కోడలు, మీకు కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డిని దీవించడానికి ఇక్కడికి వచ్చిన పాలకుర్తి బిడ్డలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. దయాకర్ రావు ఆరోజు నేను ప్రజా సేవ చేద్దామని, రాజకీయాల్లోకి వద్దామని రావడం జరిగింది. మా కుటుంబం 40 ఏళ్ల నుంచి కూడా మీ మధ్య ఉండి స్వచ్ఛందంగా సేవలు చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబం మాది. కానీ.. దయాకర్ రావుకి అది నచ్చలేదు. అది నచ్చక మేము మళ్లీ అమెరికా పోవాలని నాకు పౌరసత్వం రానీయకుండా చేశాడు. అయినా కానీ.. నేను మీకు జూన్ లో ఇచ్చిన మాట కోసం, మీకు అండగా ఉంటాననే మాట కోసం, నాకు పౌరసత్వం రాకపోయినా నా వారసత్వం అయిన కోడలును ఇక్కడికి తీసుకొచ్చాను. అదే విధంగా దయాకర్ రావు.. ఏదో ఏదో మా కుటుంబం మీద ప్రచారాలు చేస్తున్నాడు. దయాకర్ రావుకు చెప్పేదొక్కటే. మా కుటుంబం మీద మాట్లాడే హక్కు కానీ.. అర్హత కానీ నీకు లేదు. నా కుటుంబానికి, నీ కుటుంబానికి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. ఆ మధ్యలో నా పాలకుర్తి ప్రజలు ఉన్నారు. అదే విధంగా నీకు లాగా రోజుకొక పార్టీ మారలేదు దయాకర్ రావు. నీ కుటుంబంలా ఒకరు టీఆర్ఎస్ లో, ఒకరు బీజేపీలో, ఒకరు కాంగ్రెస్ లో లేము. మొదటి నుంచి మేము పాలకుర్తి ప్రజలను నమ్ముకున్నాం. పాలకుర్తి గడ్డను నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకు పైన చరిత్ర ఉన్న పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇది. ఈ పార్టీని నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చామన్నారు ఝాన్సీ రెడ్డి.
1979లో మనకు ఇందిరా గాంధీ తొర్రూర్ కు వచ్చారని.. అప్పుడు కాంగ్రెస్ వచ్చిందని.. ఈరోజు ప్రియాంకా గాంధీ వస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో డిసెంబర్ 3న కాంగ్రెస్ గెలువబోతోందని ఝాన్సీ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ జనాలను చూసి దయాకర్ రావుకు నిద్ర పట్టదు. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా.. మద్యం బాటిల్స్ ఇచ్చాన నా పాలకుర్తి ప్రజలు ఇంత మంది వచ్చారంటే.. నీ డబ్బు, మద్యం పని చేయదు. పని చేయట్లేదని ఇప్పుడే రుజువు అయింది. నవంబర్ 30న ఓటింగ్ రోజు కూడా అది పని చేయదు దయాకర్ రావు. మీరంతా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. దయాకర్ రావుకు చెప్పేది ఒక్కటే. నా అమెరికా కుటుంబం ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తారా అని అడిగారు. నా అమెరికా కుటుంబం కంటే కూడా ఇన్ని వేల మంది పాలకుర్తి ప్రజల కుటుంబం ఉంది. పాలకుర్తి ప్రజలు అందరు కూడా నా తరుపున ఉంటారని నాకు నమ్మకం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో మీరంతా ఓటింగ్ వేసేటప్పుడు యశస్విని రెడ్డికి చేతి గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటారని కోరుకుంటున్నానని ఝాన్సీ రెడ్డి చెప్పుకొచ్చారు.
Vijaya Milk : తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా…
YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…
Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…
TKGKS - KANA - Khammam : ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ…
Revanth Reddy : హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన వినోద కేంద్రానికి వేదిక కాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…
Sardar Papanna statue : తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వీరుల్లో సర్దార్ సర్వాయి పాపన్న…
IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన…
HPCL Recruitment 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ…
Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
PM Shram Yogi Mandhan Yojana : దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై యాంకర్గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించిన రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో…
This website uses cookies.