Liquor: మందు బాబులకి తాగకముందే కిక్ దిగేలా ఉందే.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
Liquor : ఈ మధ్య కాలంలో కొత్త తెలంగాణ ప్రభుత్వం Telangana Govt రైతులకి గుడ్ న్యూస్లు చెబుతూ అందరి విమర్శలు అందిపుచ్చుకుంటుంది. అయితే ఇప్పుడు Telangana తెలంగాణ సర్కార్ ఇపుడు మద్యం ప్రియులకు Wine షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై కీలక కసరత్తులు చేస్తోంది. ఏ విధంగా మద్యం ధరలు పెంచాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాల్సిన అవసరం వచ్చిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Liquor: మందు బాబులకి తాగకముందే కిక్ దిగేలా ఉందే.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
కొన్నేళ్లుగా మద్యం ధరలు పెంచకపోవటంతో.. తయారీ కంపెనీలు పెంపు కోసం ఒత్తిడి పెంచాయి. మద్యం ధరల పెంపు పైన అధ్యయనం.. సిఫార్సుల కోసం ప్రభుత్వం హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసింది.మద్యం కంపెనీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని 6 నెలల క్రితమే ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ తొలిసారి జులై 18వ తేదీన సమావేశమైంది. జులై 25వ తేదీ లోగా కంపెనీలు మద్యం సరఫరా కోసం ధరలు కోట్ చేయాలని సర్క్యులర్ ఇచ్చింది. ఆ తర్వాతి రోజే సీల్డ్ కవర్లు తెరిచి కంపెనీలు కోట్ చేసిన ధరలను కమిటీ పరిశీలించింది. మద్యం సరఫరాకు 91 కంపెనీలు ముందుకు వచ్చాయని.. బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, ఫారిన్ లిక్కర్ సహా మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్ కంపెనీలు కూడా ఉన్నట్లు సమాచారం.తెలంగాణలో చివరిసారిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మద్యం ధరలు భారీగా పెంచారు. గడిచిన 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచలేదని ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్.. తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.