Liquor: మందు బాబులకి తాగకముందే కిక్ దిగేలా ఉందే.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
Liquor : ఈ మధ్య కాలంలో కొత్త తెలంగాణ ప్రభుత్వం Telangana Govt రైతులకి గుడ్ న్యూస్లు చెబుతూ అందరి విమర్శలు అందిపుచ్చుకుంటుంది. అయితే ఇప్పుడు Telangana తెలంగాణ సర్కార్ ఇపుడు మద్యం ప్రియులకు Wine షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై కీలక కసరత్తులు చేస్తోంది. ఏ విధంగా మద్యం ధరలు పెంచాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాల్సిన అవసరం వచ్చిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Liquor: మందు బాబులకి తాగకముందే కిక్ దిగేలా ఉందే.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
కొన్నేళ్లుగా మద్యం ధరలు పెంచకపోవటంతో.. తయారీ కంపెనీలు పెంపు కోసం ఒత్తిడి పెంచాయి. మద్యం ధరల పెంపు పైన అధ్యయనం.. సిఫార్సుల కోసం ప్రభుత్వం హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసింది.మద్యం కంపెనీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని 6 నెలల క్రితమే ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ తొలిసారి జులై 18వ తేదీన సమావేశమైంది. జులై 25వ తేదీ లోగా కంపెనీలు మద్యం సరఫరా కోసం ధరలు కోట్ చేయాలని సర్క్యులర్ ఇచ్చింది. ఆ తర్వాతి రోజే సీల్డ్ కవర్లు తెరిచి కంపెనీలు కోట్ చేసిన ధరలను కమిటీ పరిశీలించింది. మద్యం సరఫరాకు 91 కంపెనీలు ముందుకు వచ్చాయని.. బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, ఫారిన్ లిక్కర్ సహా మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్ కంపెనీలు కూడా ఉన్నట్లు సమాచారం.తెలంగాణలో చివరిసారిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మద్యం ధరలు భారీగా పెంచారు. గడిచిన 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచలేదని ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్.. తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.