Telangana Polling Updates తెలంగాణలో మధ్యాహ్నం 1గంట వరకు జరిగిన పోలింగ్ శాతం ఎంతంటే…?
Telangana Polling Updates తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పోరి ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియనుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటు శాతం పెంచేందుకు అన్ని సంస్థలకు సెలవు ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో నిలుచున్న వారంతా ఓటు వేసే లా అవకాశం కల్పిస్తారు. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. ఇక ఎన్నికలు సజావుగా జరిగేందుకు 75 వేల మంది పోలీసులు బరిలో దిగారు. జిల్లాల వారీగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంత శాతం పోలింగ్ జరిగిందంటే…
హైదరాబాద్ – 20.79 శాతం
ఖమ్మం – 42.93 శాతం
జగిత్యాల – 46.14 శాతం
హనుమకొండ – 35.29 శాతం
ఆదిలాబాద్ – 41.88 శాతం
భద్రాద్రి – 39.29 శాతం
జనగాం – 44.31 శాతం
భూపాలపల్లి – 49.12 శాతం
గద్వాల్ – 49.29 శాతం
కామరెడ్డి – 40.78 శాతం
కరీంనగర్ – 40.73 శాతం
ఆసిఫాబాద్ – 42.77 శాతం
మహబూబాబాద్ – 46.89 శాతం
మహబూబ్ నగర్ – 44.93 శాతం
మంచిర్యాల – 42.74 శాతం
మెదక్ – 50.80 శాతం
మేడ్చల్ – 26.70 శాతం
ములుగు – 45.69 శాతం
నాగర్ కర్నూల్ – 39.58 శాతం
నల్గొండ – 39.20 శాతం
నారాయణపేట – 42.60 శాతం
నిర్మల్ – 41.74 శాతం
నిజామాబాద్ – 39.66 శాతం
పెద్దపల్లి – 44.49 శాతం
సిరిసిల్ల – 39.07శాతం
రంగారెడ్డి – 29.79శాతం
సంగారెడ్డి – 42.17 శాతం
సిద్దిపేట – 44.35 శాతం
సూర్యాపేట – 44.14 శాతం
వికారాబాద్ – 44.85 శాతం
వనపర్తి – 40.40 శాతం
వరంగల్ – 37.25 శాతం
యాదద్రి – 45.07శాతం పోలింగ్ నమోదయింది.
మధ్యాహ్నం 1 గంట వరకు సూర్యాపేట జిల్లాలో 44.14 శాతం పోలింగ్ నమోదైంది.సూర్యాపేట – 36.43 శాతం, తుంగతుర్తి – 52.65%,
హుజూర్ నగర్ – 48.61%,కోదాడ – 38.3%.
* నల్గొండ జిల్లాలో 39.20%
==> నల్గొండ 41.06%,
దేవరకొండ 33.4%,
మిర్యాలగూడ 39.21%, మునుగోడు 42.33%,
నకిరేకల్ 39.49%,
నాగార్జునసాగర్ 40.20 శాతం పోలింగ్ నమోదైంది.
