Medigadda : ప్రస్తుతం తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. వెంటనే కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసిన పనుల్లో జరిగిన అవకతవకలను వెలికితీస్తోంది. ముందు విద్యుత్ సంస్థలపై రేవంత్ ప్రభుత్వం పడింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించి ఎల్ అండ్ టీ సంస్థ. ఈ ప్రాజెక్టు లక్ష కోట్లకు పైనే అయింది. ఈ ప్రాజెక్టు కట్టి మూడేళ్లు కూడా కాలేదు కానీ.. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ వద్ద పగుళ్లు రావడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మళ్లీ చర్చనీయాంశమయింది. కాళేశ్వరం అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విచారణకు ఆదేశించారు. సింగిల్ జడ్జితో విచారణకు కూడా ఆదేశించారు.
అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, సొరంగాలు.. ఇలా అన్ని కలిసే ఉంటాయి. అందులో ఉన్న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దానికి కారణం ఎవరు కాదు.. దానికి బాధ్యత ఎవరు వహించాలి అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని.. కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కుంగడం చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ అనడంతో తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు ఎల్ అండ్ టీ సంస్థ కూడా అది మాకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఆ పనులు చేయాలంటే కొత్త ఒప్పందాలు ఉండాలని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. ఏ పనికి అయినా కాపర్ డ్యామ్ కట్టాలి. దానికి 56 కోట్లు కావాలి. అందుకే ఎల్ అండ్ టీ సంస్థ మేడిగడ్డ కుంగడంపై పక్కకు తప్పకుంది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. అందుకే ముందు సింగిల్ జడ్జి విచారణ కోసం వెయిట్ చేస్తున్నారు.
నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందంటే దానికి కారణం కేసీఆర్. మరి.. మేడిగడ్డ కుంగుపాటుకు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి కేసీఆర్ బాధ్యత వహిస్తారా లేదా అనేది తెలియాలంటే సింగిల్ జడ్జి విచారణ పూర్తవ్వాలి. ఆ నివేదికలో నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకుంది అని తేలితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.