Pawan Kalyan – Chandrababu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమరం స్టార్ట్ అయింది. ఇంకా నాలుగు నెలలు కూడా ఎన్నికలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. నిజానికి ఏపీలో ఎన్నికలు అంటేనే ఆ హడావుడి వేరే ఉంటుంది. మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే ఉంటుంది. అయితే.. ఈసారి ఏపీలో ద్విముఖ పోటీలాగానే కనిపిస్తోంది. అధికార వైసీపీ ఒకవైపు అయితే.. మరోవైపు టీడీపీ, జనసేన నిలబడ్డాయి. త్వరలోనే బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఈనేపథ్యంలో టీడీపీ పార్టీ జనసేన అభ్యర్థులకు ఎన్ని సీట్లు ఇస్తుంది అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
అసలు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారు. ఈనేపథ్యంలో పొత్తులపై ఇద్దరు డిస్కస్ చేశారు. అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి. ఏ నియోజకవర్గంలో ఇవ్వాలి. అధికారంలోకి ఈ కూటమి వస్తే.. ఎవరు అధికారాన్ని పంచుకుంటారు అనే దానిపై ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే.. జనసేన పార్టీకి 28 టికెట్లు మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట. ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం టికెట్ల విషయంలో క్లాష్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎంపీ టికెట్లు కూడా జనసేనకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరినట్టు తెలుస్తోంది.
ఓవరాల్ గా జనసేన పార్టీకి టీడీపీ కేటాయించబోయే స్థానాలు ఇవే అని తెలుస్తోంది. నెల్లిమర్ల, భీమిలి, గాజువాక, ఎలమంచిలి లేదా పెందుర్తి, పాడేరు, రాజానగరం, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, పీ గన్నవరం, రాజోలు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లి, ఉంగుటూరు లేదా ఏలూరు, నిడదవోలు లేదా తణుకు, కొవ్వూరు, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, పెడన, తెనాలి, గుంటూరు వెస్ట్, గిద్దలూరు, దర్శి, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, రాజంపేట నియోజకవర్గాల్లో టీడీపీ.. జనసేనకు టికెట్లు కేటాయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.