Pawan Kalyan : ఏపీ ప్రజలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన చేయడంతో పాటు ఏపీ ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెలంగాణలోని జనసేన నాయకులు, క్రియాశీలక కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ నుంచి తెలంగాణకు మళ్లీ వలసలు పెరుగుతాయని చెప్పారు.
pawan kalyan sensational comments on ap people
ఏపీలో పాలకుల దాష్టికాలు పెరిగాయని విమర్శించారు. పాలకుల దౌర్జన్యాలు తట్టుకోలేక ఏపీ నుంచి తెలంగాణకు వలసలు పెరిగిపోతాయని, అప్పుడు తెలంగాణ మళ్లీ బాధపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కులాల కొట్లాట అభివృద్ధి దిగజారిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జనసేన రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు.
pawan kalyan sensational comments on ap people
ఇంత కాలం తెలంగాణకు ఎందుకు రాలేదంటే.. తెలంగాణ ప్రజలు తనను పిలవలేదని, ప్రజలు పిలిచే వరకు తాను తెలంగాణ రాజకీయాల్లోకి రాబోనని తెలిపారు. తాను తెలంగాణ ప్రజలకు రుణపడి ఉన్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ యాసను, భాషను తాను గౌరవిస్తానని పవన్ చెప్పారు.
