Home » News » Karthika Deepam 2 Today Episode August 26th
News

Karthika Deepam 2 Today Episode August 26th : జ్యోత్స్నకు సూరజ్ గిఫ్ట్.. పెళ్లి తర్వాత నిజం చెప్పేస్తానంటున్న జ్యోత్స్న

Karthika Deepam 2 Today Episode August 26th స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ రోజుకో ఆసక్తికరమైన మలుపుతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతోంది. పెళ్లి సందడి మధ్యలోనే కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు, దాచిన నిజాలు
Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 26, 2026 10:36 am
Advertisement

Karthika Deepam 2 Today Episode August 26th : స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ రోజుకో ఆసక్తికరమైన మలుపుతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతోంది. పెళ్లి సందడి మధ్యలోనే కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు, దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా జ్యోత్స్న, సూరజ్ మధ్య చోటుచేసుకున్న సన్నివేశాలు ఈరోజు ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంతకీ ఆగస్టు 26 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలో దక్షిణామూర్తి తన కోడలితో కలిసి పెళ్లికి వెళ్లాలని చెబుతాడు. అయితే మాలిని మాత్రం మీరు రావద్దంటుంది. మొదటి శుభలేఖ అందుకున్న వియ్యంకుడిని, తన మిత్రుడిని తాను పెళ్లికి రాకుండా ఎలా ఉంటానని దక్షిణామూర్తి ప్రశ్నిస్తాడు. కానీ మాలిని మాత్రం గతంలో జరిగిన అవమానాలను గుర్తు చేస్తుంది. మీరు అక్కడికి వెళ్లిన ప్రతిసారీ అవమానమే ఎదురవుతుందని ఆమె చెబుతుంది. కనీసం మీ అల్లుడు కూడా మిమ్మల్ని పిలవడానికి రాడని, మీ కూతురు సైతం మిమ్మల్ని సరిగ్గా పలకరించదని బాధపడుతుంది. అయితే దక్షిణామూర్తి మాత్రం ఇక పరిస్థితులు మారబోతున్నాయని అంటాడు. అందరూ తనను వెతుక్కుంటూ వచ్చే రోజు దగ్గర్లోనే ఉందని ధీమా వ్యక్తం చేస్తాడు. అంతేకాదు.. అందరూ మిమ్మల్ని గౌరవంగా పలకరించేలా నేను చేస్తానని మాలిని అతడిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. చివరకు ఆమె ఒక్కతే పెళ్లికి బయలుదేరుతుంది.

Advertisement

Karthika Deepam 2 Today Episode August 26th : జ్యోత్స్నకు సూరజ్ గిఫ్ట్.. పెళ్లి తర్వాత నిజం చెప్పేస్తానంటున్న జ్యోత్స్న

Karthika Deepam 2 Today Episode August 26th మాలినికి నచ్చజెప్పి పెళ్లికి బయలుదేరిన దక్షిణామూర్తి కోడలు

ఇదిలా ఉండగా మరోవైపు జ్యోత్స్న గదిలోకి సూరజ్ వస్తాడు. తలుపు తట్టి రావడం కూడా తెలియదా అంటూ జ్యోత్స్న అతడిని ప్రశ్నిస్తుంది. అయితే రూమ్‌లో నువ్వు మాత్రమే ఉంటావని తెలిసే వచ్చానని సూరజ్ సమాధానం ఇస్తాడు. నువ్వు ఎలా ఉన్నావో తెలియకుండా ఎలా వస్తావని జ్యోత్స్న అడగగా, నిన్ను ఫొటోలో చూశాను కాబట్టే ధైర్యంగా వచ్చానని సూరజ్ చెబుతాడు. తాను కూడా సూరజ్‌ను ఫొటోలో చూశానని, కానీ నేరుగా చూస్తే ఇంకా చాలా బాగున్నావని జ్యోత్స్న అంటుంది. అందుకు సూరజ్ కూడా నువ్వు చాలా బాగున్నావని చెబుతాడు. ఇంతలో సూరజ్ చేతిలో ఉన్న వస్తువును గమనించిన జ్యోత్స్న.. చేతిలో ఏంటని అడుగుతుంది. అది గిఫ్ట్ అని సూరజ్ చెబుతాడు.

Advertisement

జ్యోత్స్నకు సూరజ్ గిఫ్ట్.. ప్రేమను వ్యక్తం చేసిన జ్యోత్స్న

ఇప్పుడు గిఫ్ట్ ఎందుకు అని జ్యోత్స్న ప్రశ్నించగా.. నువ్వు నాకు చాలా ఇచ్చావు, కానీ నేను నీకు ఏమీ ఇవ్వలేదని గతంలో అన్నావు కదా.. అందుకే నీ కోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చానని సూరజ్ చెబుతాడు. దీంతో గిఫ్ట్‌ను వెంటనే ఇవ్వాలని, ఇప్పుడే ఓపెన్ చేసి చూడాలని జ్యోత్స్న ఆసక్తిగా అడుగుతుంది. కానీ సూరజ్ మాత్రం ఇప్పుడు వద్దని, తర్వాత ఓపెన్ చేయమని చెబుతాడు. దీంతో మనిద్దరం పక్కపక్కనే కూర్చొని గిఫ్ట్ ఓపెన్ చేద్దామని జ్యోత్స్న అనుకుంటుంది. అయితే అందులో ఏముందో నువ్వు ఒక్కదానివే చూస్తావని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకు మరింత ఆసక్తి పెరుగుతుంది. నువ్వు ఏం చెప్పినా దాని వెనుక ఏదో అర్థం ఉంటుంది.. అసలు గిఫ్ట్‌లో ఏముందో చెప్పమని జ్యోత్స్న అడుగుతుంది. అందులో ఉన్నది ఆశ్చర్యమే అని సూరజ్ చెప్పి సస్పెన్స్ పెంచుతాడు. అదే సమయంలో జ్యోత్స్న కూడా తన మనసులోని మాటను బయటపెడుతుంది. నువ్వు ఏం చేసినా చాలా ప్రత్యేకంగానే ఉంటుందని, సూరజ్ ఇప్పటికే చాలాసార్లు తనకు లవ్ ప్రపోజ్ చేశాడని గుర్తు చేస్తుంది. కానీ తాను మాత్రం ఇప్పటివరకు అతడికి తన ప్రేమను చెప్పలేదని అంటుంది. తమ ప్రేమకు మిగిలింది కూడా కొద్దిసమయమే కావడంతో, ఈ సమయంలో తాను కూడా ఒక పని చేయాలని నిర్ణయించుకున్నానని చెబుతుంది.

అంటూ చేతిలోని పువ్వును సూరజ్‌కు అందించి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఆ ఫ్లవర్ తీసుకోమని చెబుతూ ఐ లవ్ యు అంటుంది జ్యోత్స్న. అయితే సూరజ్ మాత్రం వెంటనే ఆ పువ్వును తీసుకోడు. తీసుకుంటాను కానీ ఇప్పుడు కాదు.. మన పెళ్లి అయిన తర్వాత తీసుకుంటానని చెబుతాడు. పెళ్లి తర్వాత మనిద్దరం భార్యాభర్తలమవుతామని జ్యోత్స్న చెప్పగా, అప్పుడు తీసుకుంటే ఆ క్షణం మరింత అందంగా ఉంటుందని సూరజ్ అంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఇప్పుడే ఈ ఫ్లవర్ తీసుకోవాలని పట్టుబడుతుంది. లేదంటే తాను ఈ గది నుంచి బయటకు రానని అంటుంది. చివరకు సూరజ్ ఆమె మాట విని ఫ్లవర్ తీసుకుంటాడు. మండపంలో కలుద్దామని, అలాగే తాను ఇచ్చిన గిఫ్ట్‌ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.సూరజ్ కనీసం “ఐ లవ్ యు టూ” అని చెప్పలేదని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ‘సరే’ అని మాత్రమే చెప్పాడు.. కానీ నేను మాత్రం నా ప్రేమను చెప్పేశాను కదా అని తనను తాను ఓదార్చుకుంటుంది. అనంతరం సూరజ్ ఇచ్చిన గిఫ్ట్‌ను జ్యోత్స్న ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లి భద్రంగా దాచిపెడుతుంది. మరోవైపు పెళ్లికి వచ్చిన అతిథులను శివన్నారాయణ స్వయంగా ఆహ్వానిస్తూ ఉంటాడు. అదే సమయంలో సూరజ్‌ను పెంచిన వ్యక్తి కూడా అక్కడికి వస్తాడు. అతడిని దశరథ్‌కు శివన్నారాయణ పరిచయం చేస్తాడు. అతడి బాధ్యతను నువ్వే చూసుకోవాలని కార్తీక్‌కు అప్పగిస్తాడు.

Advertisement

సూరజ్ తరఫున రావాల్సిన ఏకైక బంధువు కూడా వచ్చేశాడని శివన్నారాయణ అంటాడు. ఇక సూరజ్ తనవాడు అని చెప్పుకోవడానికి అక్కడ ఎవరున్నారు అంటూ మాట్లాడుతుండగానే మాలిని అక్కడికి వచ్చి శివన్నారాయణను పలకరిస్తుంది. మాలిని వస్తుందని ఊహించలేదని శివన్నారాయణ చెప్పగా, కార్డు ఇచ్చిన తర్వాత తాను రాకుండా ఎలా ఉంటానని ఆమె సమాధానం ఇస్తుంది. వెంటనే మీ మామగారు ఎక్కడ అని శివన్నారాయణ అడుగుతాడు. ఆయన రాలేదని మాలిని చెబుతుంది. ఆ సమయంలో శివన్నారాయణ కూడా మాలినిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడతాడు. తనతో పోటీకి వచ్చి ఓడిపోయే పరిస్థితి అయితే వేరుగా ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెబుతాడు. అనంతరం మాలినిని ముందు వరుసలో కూర్చోబెట్టాలని దీపకు చెబుతాడు.

ఎందుకు తనకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని మాలిని అడగడంతో, అది ప్రత్యేక ప్రాధాన్యత కాదని శివన్నారాయణ అంటాడు. సూరజ్ అనాథ అని ఎలా పెళ్లి చేస్తారని గతంలో నువ్వే అడిగావు కదా.. ఇప్పుడు సూరజ్ పెళ్లి ఎలా జరుగుతుందో నీ కళ్లతో నువ్వే చూడాలని చెబుతాడు. దీంతో మాలినిని ముందు వరుసలో కూర్చోబెట్టమని దీపను ఆదేశిస్తాడు. ఇంతలో పెళ్లి సమయం దగ్గరపడుతుంది. పెళ్లికూతురిని తీసుకురావాలని పంతులు చెప్పడంతో దీప, సుమిత్ర కలిసి పెళ్లికూతురిని తీసుకురావడానికి వెళ్తారు. అదే సమయంలో జ్యోత్స్న తన తల్లితో తాను ఇప్పుడే వస్తానని చెప్పి దాసు దగ్గరకు వెళ్తుంది.

దాసు పారిజాతంతో మాట్లాడుతుండగా జ్యోత్స్న అక్కడికి రావడం చూసి ఆశ్చర్యపోతాడు. పెళ్లికూతురి వేషంలో జ్యోత్స్నను చూసి బంగారు బొమ్మలా ఉన్నావని ఎంతో ఆనందంగా చెబుతాడు. నిజంగా తాను బాగున్నానా అని జ్యోత్స్న అడుగుతుంది. నీకేం తక్కువ.. ఒక జన్మకు సరిపడా అదృష్టాన్ని దేవుడు నీకు వరంగా ఇచ్చాడని దాసు అంటాడు. తనకు తండ్రి ఆశీర్వాదం కావాలని జ్యోత్స్న అడుగుతుంది. అయితే తన చేతులతో ఆశీర్వదించే యోగ్యత తనకు లేదని, ఎవరైనా వచ్చి చూస్తే బాగుండదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని దాసు చెబుతాడు. అయితే జ్యోత్స్న మాత్రం ఇక ఆగదు. నువ్వే నా తండ్రివని అందరికీ చెప్పేస్తానని సంచలనంగా చెబుతుంది. దీంతో దాసు, పారిజాతం ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తాను దశరథ్ అన్నయ్య కూతురిగా ఉంటేనే ఇంతటి వైభవం, గౌరవం దక్కుతుందని దాసు ఆమెకు వివరిస్తాడు. తనలాంటి వ్యక్తికి కూతురిగా ఉంటే ప్రస్తుతం తనకు ఉన్న గౌరవం, మర్యాద కూడా పోతాయని అంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఎప్పటికైనా నిజం బయటకు రావాల్సిందే కదా అని ప్రశ్నిస్తుంది. అందుకు పారిజాతం స్పందిస్తూ నిజాలు బయటపడితే కొన్ని జీవితాలు తగలబడిపోతాయని హెచ్చరిస్తుంది. ఇప్పటికే తాము చేసిన తప్పుల కారణంగా కొన్ని జీవితాలు చీకట్లో నాశనం అవుతున్నాయని జ్యోత్స్న ఆవేదన వ్యక్తం చేస్తుంది.

ఇక తాను తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్పష్టంగా చెబుతుంది. దశరథ్ కూతురిగా పెళ్లి చేసుకుంటానని, కానీ పెళ్లి తర్వాత దాసు కూతురిగా జీవిస్తానని జ్యోత్స్న అంటుంది. చేసిన పాపాల్లో కొన్నింటినైనా కడుక్కోవాల్సిన సమయం వచ్చిందని ఆమె భావిస్తుంది.తన మాట వినాలని పారిజాతం మరోసారి కోరుతుంది. కానీ ఇక ఎవరి మాటా వినే పరిస్థితిలో తాను లేనని జ్యోత్స్న తేల్చి చెబుతుంది. తన మెడలో తాళి పడిన వెంటనే అందరికీ అసలు నిజం చెప్పేస్తానని సంచలన నిర్ణయం వెల్లడిస్తుంది. ఆ తర్వాత తన తండ్రి దాసును చూసి.. తాను నిజం చెప్పబోతుంటే ఆయన ఏమంటారని అడుగుతుంది.

Advertisement

అందుకు దాసు కూడా ఆమె నిర్ణయాన్ని అడ్డుకోకుండా.. నీ ఇష్టం, నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయమని చెబుతాడు. దీంతో పరిస్థితి మరింత భావోద్వేగంగా మారుతుంది. అప్పుడే దీప అక్కడికి వచ్చి జ్యోత్స్నను పెళ్లి కోసం తీసుకెళ్లడానికి పిలుస్తుంది. అయితే పారిజాతం మాత్రం దీపను వెళ్లమని, తాను జ్యోత్స్నతో మాట్లాడాలని అంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఇక ఎవరో ఒకరితో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, దీపతోనే వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఇలా జ్యోత్స్న తన జీవితంలోని అతి పెద్ద నిజాన్ని పెళ్లి మండపంలోనే బయటపెట్టాలని నిర్ణయించుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. మరి జ్యోత్స్న నిజంగానే తాళి పడిన వెంటనే తన తండ్రి దాసు అని అందరి ముందు చెబుతుందా? సూరజ్ ఇచ్చిన గిఫ్ట్‌లో అసలు ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి