Parents : ప్రస్తుతం సమాజంలో మానవత్వం అనేది జనాలు మరిచినట్లుగా ఉన్నారు. రోజురోజుకి జనాలలో మానవత్వం అనేది నశించిపోతుందా అంటే నిజమే అని చెప్పాలి. ఆస్తుల కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను దూరం చేసుకుంటున్నారు. పైసకు ఉన్న విలువ మనిషికి లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. డబ్బు ఉంటే చాలు బంధుత్వాలు అవసరం లేదని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బిడ్డలు వారిని భారంగా మోస్తున్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను అనాధ ఆశ్రమాలకు పంపిస్తున్నారు. మరి కొందరు ఆ మాత్రం కనికరం కూడా చూపడం లేదు. ఇంకొందరు ఆస్తుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నవారు ఉన్నారు.
తాజాగా అందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్తికోసం కొడుకు తన తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సోదరుడికి భూమి ఎలా రాశారు అంటూ తల్లి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ కాలితో తన్నుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తండ్రిని చంప మీద కొట్టి తిడుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె నీరుగట్టువారి పల్లెలో జరిగింది. తల్లిదండ్రులపై కొడుకు దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులను కొట్టిన కొడుకు బాగు పడినట్లు చరిత్రలో లేదని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆస్తికోసం తల్లిదండ్రులకు విచక్షణారహితంగా దాడి చేయడం పై నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఇలా బాధించడం ఏమాత్రం సరైనది కాదు అని, చిన్నప్పటి నుంచి పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉంటారు. తమ బిడ్డలు చల్లగా ఉండాలని తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి వారిని ప్రయోజకులను చేస్తే చివరికి ఇలా బిడ్డలు తల్లిదండ్రులనే హింసించే స్థితికి వస్తున్నారు. చిన్నప్పటినుంచి సాధినందుకు, పెంచినందుకు కొడుకే తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి. అంతేకానీ ఇలా ఆస్తి కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం సరైనది కాదు. తల్లిదండ్రులను బాధ పెట్టినవాడు బాగుపడినట్లు చరిత్రలో లేదని పెద్దలు అంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.