Afternoon Sleeping : పగటిపూట నిద్రపోతున్నారా..? అయితే ఇక ప్రమాదంలో పడినట్లే...!
Afternoon Sleeping : నిద్ర అనేది ఎంతో అవసరం. నిద్ర లేని సమస్యతో ఇబ్బంది పడే వారికి ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సరియైన నిద్ర లేకపోతే వారికి డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు ఇంకా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే సరియైన నిద్ర నిద్రించకపోయిన ఇబ్బందే.. నిద్ర అధికంగా నిద్రపోయిన ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. చాలామంది మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతూ ఉంటారు.. కొంతమందికి అది జీవితంలో ఒక భాగంగా మారిపోతూ ఉంటుంది.
మధ్యాహ్నం భోజనం తర్వాత కచ్చితంగా పడుకుంటుంటారు. అయితే ఈ మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం ప్రమాదం తప్పదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్లు ఆరోగ్యాన్ని కూడా డేంజరే నట. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది రాత్రి పూట నిద్రకు భంగం కలిగిస్తుంది.మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల స్ట్రోక్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఆడవారు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు పని చేసి చేసి అలసిపోయి భోజనం చేసి అలా పడుకుంటూ ఉంటారు. భోజనం చేయగానే అలసిపోయి ఉన్న ఉన్న శరీరం విశ్రాంతి కావాలంటుంది. దాంతో ఆటోమేటిక్గా కొందరు నిద్రపోతూ ఉంటారు.
ఒకవేళ ఆ అలవాటు మర్చిపోలేక పోతే ఓ 30 నిమిషాల పాటు నిద్రపోయి తర్వాత మేలుకోవాలి అని నిపుణులు చెప్తున్నారు. అంతేగాని మితిమీర నిద్రపోతే ఎన్నో వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25% ఆటంకాలు ఎక్కువ. రాత్రి సమయంలో నిద్రను కోల్పోయే రూపనగ కూడా గుర్తించవచ్చు. రాత్రి సరియైన నిద్ర లేకపోతే అధిక రక్తపోటు ,డయాబెటిస్ గుండె జబ్బులు, ఊబకాయం, ఆందోళన లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే చిన్నపిల్లలు , వృద్ధులు అనారోగ్యంగా ఉన్నవారు మాత్రం పగలు గరిష్టంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చు. మిగిలిన వారు గరిష్టంగా 10 నిమిషాల నుంచి అరగంటలోపు మాత్రమే పడుకోవాలి అంటున్నారు నిపుణులు.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.