Viral Video : దేశం పురోగతి దిశగా ముందుకు వెళ్తున్నదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు వ్యతిరేకంగా ప్రతిబింబిస్తున్నాయి. తల్లి శవాన్ని సొంత గ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వ అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో తరలించే స్థోమత లేక కన్నకొడుకు బండిపై మోసుకుని 80 కిలోమీటర్లు ప్రయాణించిన ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి రావడంతో అసలు మనం ఎక్కడ ఉన్నామనే ప్రశ్న మరోసారి తలెత్తింది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ప్రజలు, మేధావి వర్గం కోరుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుడారులో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.
తల్లికి ఆరోగ్యం బాలేక పోవడంతో కొడుకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అయితే, ఆమె మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్సు అందుబాటులో లేదు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాలంటే రూ.5000 అవసరం. అతని వద్ద అంత డబ్బులు లేవు. దీంతో తన వద్ద ఉన్న రూ.100తో ఒక చెక్క కొని దానిని బైకు మధ్యలో పెట్టి తల్లి మృతదేహాన్ని దానిపై పడుకోబెట్టుకుని 80 కిలో మీటర్లు ప్రయాణం ప్రారంభించాడు.
దారిమధ్యలో కొందరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూసినా అక్కడి ప్రభుత్వాలు సీతకన్ను వేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇదిలాఉండగా చికిత్స సమయంలో ఆస్పత్రి వైద్యులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే తన మిత్రుని తల్లి మరణించిందని బాధితుడి స్నేహితుడు ఆరోపించాడు. ఈ విషయంలో ఆస్పత్రి సిబ్బందితో బాధిత కుటుంబం వాగ్వాదానికి దిగినట్టు కూడా తెలిసింది.
Lucky : వారంలోని ఏడు రోజులలో ఒక్కొక్క రోజు ఒక్క దేవుడికి అంకితం చేయబడింది. అందులో శుక్రవారన్ని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది.…
Ginger Garlic Paste : హైదరాబాదులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీ మొత్తంలో బయటపడింది. అయితే లంగర్ హౌస్ పోలీస్…
Zodiac Signs : మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే మానసిక శ్రమ మరియు శారీరక శ్రమ మాత్రమే కాకుండా గ్రహాల…
Ys Sharmila : ప్రస్తుతం ఏపీలో జగన్, షర్మిళల ఆస్తి పంపకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జగన్, షర్మిల మధ్య…
Adabidda Nidhi Scheme : ఏపీ ప్రభువం నుంచి ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్ధిక…
Mekathoti Sucharitha : ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ దారుణమైన ఓటమి చవిచూడడంతో పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా…
Annadata Sukhibhava Scheme : ఏపీ రైతులకు ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం…
Pawan Kalyan : అధికారంలో ఐదేళ్లు ఉండి, ఆ తర్వాత పదవి పోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు జగన్ని…
This website uses cookies.