Viral Video : కుక్కల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెంపుడు కుక్కలు. అవి చాలా నమ్మకంగా ఉంటాయి. యజమానికి అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. అందుకే కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా లేదంటారు పెద్దలు. కుక్కకు అంత విశ్వాసం ఉంటుంది కాబట్టే చాలామంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈరోజుల్లో ప్రతి ఇంట్లో కుక్క ఉండటం కామన్ అయింది.సాధారణంగా ఏ కుక్క అయినా తమ యజమానికి సంబంధించిన ఏ వస్తువును వేరే వాళ్లను ముట్టుకోనివ్వదు. యజమాని ఇంటికి ఎవరు వచ్చినా కూడా కుక్కలు వెంటనే అరుస్తుంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దానికి కారణం.. ఆ కుక్క యజమానిపై చూపించిన వాత్సల్యం. ఓ మహిళ తన పెంపుడు కుక్కను తీసుకొని గోదావరి నది బ్రిడ్జి దగ్గరికి వెళ్లింది. బ్రిడ్జి మీద కుక్కను వదిలేసి.. తన చెప్పులు కూడా అక్కడే విప్పి బ్రిడ్జి మీది నుంచి దూకేసింది. ఆ కుక్కకు ఆ విషయం తెలియక.. ఆమహిళ చెప్పుల వద్ద కాపలాగా కూర్చొంది.రాత్రి మొత్తం తన యజమాని చెప్పుల వద్దనే కాపలా కాస్తూ కూర్చొంది కుక్క. తన యజమాని ఇంకెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంది. అటువైపు వెళ్తున్న వాళ్లను చూసి కుక్క మొరగడం, ఆ కుక్క చెప్పుల వద్ద చాలాసేపటి నుంచి కూర్చొని ఉండటం చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు వచ్చి దర్యాప్తు చేయగా.. ఆ కుక్క యజమాని అయిన మహిళ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుక్కను చూసి అటువైపు వెళ్లే వాళ్లు అయ్యో పాపం.. అంటున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.