తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం, ధ్యేయమని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం బోథ్ మండల కేంద్రంలో ఆయన పలువురికి ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నదన్నారు. ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ఫస్ట్ ప్రయారిటీ అని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలను సర్కారు ఆదుకుంటున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తూ దళిత జాతికి భరోసా ఇస్తున్నదని వివరించారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.