తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం, ధ్యేయమని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం బోథ్ మండల కేంద్రంలో ఆయన పలువురికి ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నదన్నారు. ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ఫస్ట్ ప్రయారిటీ అని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలను సర్కారు ఆదుకుంటున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తూ దళిత జాతికి భరోసా ఇస్తున్నదని వివరించారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
This website uses cookies.