Adilabad..ప్రజా సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రాథోడ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adilabad..ప్రజా సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రాథోడ్

తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం, ధ్యేయమని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం బోథ్ మండల కేంద్రంలో ఆయన పలువురికి ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నదన్నారు. ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ఫస్ట్ ప్రయారిటీ అని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలను సర్కారు […]

 Authored By praveen | The Telugu News | Updated on :14 September 2021,3:42 pm

తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం, ధ్యేయమని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం బోథ్ మండల కేంద్రంలో ఆయన పలువురికి ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నదన్నారు. ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ఫస్ట్ ప్రయారిటీ అని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలను సర్కారు ఆదుకుంటున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తూ దళిత జాతికి భరోసా ఇస్తున్నదని వివరించారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది