
వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని, వారి అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల నియామకం ఊసే లేదని విమర్శించారు. టీడీపీ పార్టీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్గానే చూసిందని ఆరోపించారు. అయితే, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ డైరెక్టర్ల నియామకంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. సామాజిక న్యాయం అమలయ్యే విధంగా చూశారని తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చారని, మహిళలకు 52 శాతం అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఇకపోతే ఓసీలకు 42 శాతం పదవులిచ్చినట్లు వివరించారు. బలహీన వర్గాలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి సుచరిత చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.