Jagan – Amaravati : ఏపీలో ఆర్ 5 జోన్ గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు. పేదలకు ఇచ్చిన ఆర్ 5 జోన్ స్థలాల్లో జులై 8 నుంచి ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని సీఎం జగన్ తెలిపారు. సీఎం జగన్ తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి రోజున అంటే జులై 8న ఇళ్ల నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. దానికి సంబంధించి గృహ నిర్మాణ అధికారులు కూడా లబ్ధిదారుల నుంచి మూడు ఆప్షన్లను తీసుకున్నారని..
అమరావతి అనేది సామాజిక రాజధాని అని.. అక్కడ అన్ని సామాజిక తరగతుల వారికి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పేదలంటే అంత చులకన చేస్తారా? పేదలకు ఇళ్లు కట్టిస్తే మురికివాడలు వస్తాయా? సామాజిక సమతుల్యత దెబ్బతింటుందా? టీడీపీ నాయకులు పేదలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేశారు. వాళ్లకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వనీయలేదు. అయినా కూడా సామాజిక న్యాయం కోసం పేదలకు రూ.10 లక్షల విలువైన స్థలాలను ప్రతి ఒక్క పేద మహిళలకు అందించాం అని సీఎం జగన్ తెలిపారు.
ఇవి కేవలం ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలు అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఏదో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయించి వదిలేయడం కాదు. వాళ్లకు ఇళ్ల నిర్మాణంతో పాటు.. అక్కడే అంగన్ వాడీ కేంద్రం, విలేజీ క్లీనిక్, డిజిటల్ లైబ్రరీ, ప్రాథమిక పాఠశాల, పార్కులు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.. అని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అలాగే.. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు సీఎం జగన్ పంపిణీ చేశారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.