జిల్లాలోని కదిరి మున్సిపల్ పరిధిలో కదిరి శాసన సభ్యుడు డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి సోమవారం పర్యటించారు. ఎనిమిదో వార్డు ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మొక్కను నాటారు. ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల ఉద్యమంగా సాగాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లందరూ బాధ్యత తీసుకుని వీలైన అన్ని చోట్ల మొక్కలు నాటాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వైసీపీ సర్కారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటి పర్యవేక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతీ ఒక్క కౌన్సిలర్ బాధ్యతగా మొక్కల పెంపకం చేపట్టాలని, ఓన్లీ మొక్కలు నాటడంతోనే పని అయిపోయిందనుకోవద్దని వాటి పెంపకం బాధ్యత కూడా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.