Categories: andhra pradeshNews

Jogi Ramesh : బిగ్ బ్రేకింగ్‌.. జోగి ర‌మేష్ కుమారుడు అరెస్ట్… ఏసీబీ సోదాల‌తో వ‌ణుకు..!

Jogi Ramesh  : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ నాయ‌కుల గుండెల‌లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గృహ నిర్మాణ శాఖమాజీ మంత్రి జోగి రమేష్‌కు భారీ దెబ్బ తగిలింది అని చెప్పాలి.. ఆయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి ర‌మేష్ నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించినట్లు తెలుస్తున్నది

Jogi Ramesh  ఏసీబీ దాడులు..

అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే ఆరోపణలను జోగి రమేష్ ఎదుర్కొంటోన్నారు. సీఐడీ అధికారుల ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అక్కడి అగ్రిగోల్డ్ భూములను ఆయన కోనుగోలు చేసి, విక్రయించారనే ఆరోపణలు ఇదివరకు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అంబాపురం అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి, వాటిని విక్రయించారని, దీని ద్వారా అయిదు కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారనేది జోగి రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంబాపురంలో సర్వే నంబర్లు 69/2, 87లో అగ్రిగోల్డ్‌కు దాదాపు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉండగా.. దాన్ని గతంలో సీఐడీ స్వాధీనం చేసుకుంది. ఆ భూమిని జోగి రమేష్ సమీప బంధువులు తమ పేరు మీద బదలాయించుకున్నట్లు చెబుతున్నారు.

Jogi Ramesh : బిగ్ బ్రేకింగ్‌.. జోగి ర‌మేష్ కుమారుడు అరెస్ట్… ఏసీబీ సోదాల‌తో వ‌ణుకు..!

ఈ వ్యవహారంపై గతంలో జోగి రమేష్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడదే అంశం నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడి చేసినట్లు సమాచారం మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1 గా ఉన్నాడు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్. ఏ2గా ఉన్న జోగి రమేష్ బాబాయి జోగి వేంకటేశ్వర రావు ఉన్నారు. ఈ తరుణంలోనే… మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. జోగి రాజీవ్, జోగి వేంకటేశ్వర రావు ఇద్దరినీ అరెస్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.

Recent Posts

AP Free Bus Scheme | ఏసీ బ‌స్సుల్లోను ఫ్రీగా ప్ర‌యాణించే ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ ఎండీ

AP Free Bus Scheme |  ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…

58 minutes ago

Telangana IPS Transfers | తెలంగాణలో భారీ ఐపీఎస్ బదిలీలు .. ప్రభుత్వ పరిపాలనలో కొత్త అడుగులు…

Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…

3 hours ago

Allu Family | అల్లు వారింట పెళ్లి సంద‌డి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి ఎవ‌రంటే..!

Allu Family | మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…

4 hours ago

Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!

Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…

5 hours ago

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

6 hours ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

7 hours ago

Sabudana | నవరాత్రి ఉపవాసంలో సబుదాన ఎక్కువ తినొద్దు ..నిపుణుల హెచ్చరిక

Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…

8 hours ago

Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక

Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…

9 hours ago