Allu Arjun : ఈ సారి ఏపీ రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్గా మారాయో మనం చూశాం. జోరుగా ప్రచారాలు, తీవ్ర విమర్శలతో రాజకీయం రచ్చగా మారింది. ఇక ప్రచారాలలో సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొనడం మరింత ఊపు తీసుకొచ్చినట్టైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం ఏపీ ఎన్నికల ప్రచారానికి మరింత జోష్ తీసుకొచ్చింది. ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్.. కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో బన్నీ, శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు అల్లు అర్జున్, బన్నీలు రెండు వేరు వేరు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులను కలిసేందుకు వెళ్లడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ రెండు ఎపిసోడ్లతో ఆంధ్రప్రదేశ్ ఓటర్లను అయోమయానికి గురి చేసినట్లయింది. రవిచంద్ర రెడ్డి భార్య.. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారట. గత ఎన్నికల్లో రవిచంద్ర రెడ్డి కోసం ట్వీట్ చేశానని బన్నీ తాజాగా నంద్యాలలో మీడియాతో తెలిపారు. ఈసారి ట్వీట్ సరిపోదు.. ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని అనిపించింది. ఆయన వద్దు.. మీకు ప్రాబ్లెమ్ అవుతుంది అని చెప్పారు. పర్వాలేదు నేను వస్తాను అని తానే నిర్ణయించుకుని వచ్చినట్లు అల్లు అర్జున్ తెలిపారు.
పార్టీలతో సంబంధం లేదని అల్లు అర్జున్ తెలిపాడు. తన ఫ్రెండ్స్, మనసుకు నచ్చినవాళ్లు ఏ పార్టీలో ఉన్న సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ తెలిపాడు. శిల్ప రవిచంద్ర ఇంటికి బన్నీ రావడంతో ఆ ప్రాంతం జన సంద్రంలాగా మారింది. వేలాదిమంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే శిల్పా రవిచంద్ర, అల్లు అర్జున్ ఇద్దరికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి షాక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేసారంటూ కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద బన్నీ, రవిచంద్రపై కేసు నమోదు అయింది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.