Amaravati : ఏపీ ప్రజల ఆశలు నెరవేరబోతున్న క్షణం రానేవచ్చింది..!
Amaravati : అమరావతిలో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభం కానుండగా, దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడంతో కౌంట్డౌన్ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అమరావతికి వచ్చి 49,040 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా హైకోర్ట్, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు ప్రజాప్రతినిధుల నివాస సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. అంతేకాక, డీఆర్డీవో, రైల్వే, డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ వంటి శాఖల ప్రాజెక్టులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. నాగాయలంకలో 1,500 కోట్ల రూపాయలతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
Amaravati : ఏపీ ప్రజల ఆశలు నెరవేరబోతున్న క్షణం రానేవచ్చింది..!
ఈ మహా కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర-రాష్ట్ర మంత్రులు వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మూడుచోట్ల ప్రజల కోసం సభా ప్రాంగణాలు ఏర్పాటు చేసినా, ప్రధాన వేదిక మాత్రం ఒక్కటే. ప్రధాని భద్రత కోసం ఎస్పీజీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. హెలిపాడ్ నుంచి కారులోనే వేదిక చేరుకోనున్న మోదీ, అక్కడ అమరావతి రీస్టార్ట్ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఈ పైలాన్ “A” అక్షర ఆకారంలో 21 అడుగుల ఎత్తుతో, పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించబడింది.
ప్రజల సందర్శనకు కూడా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటల నుంచి ప్రాంగణానికి ప్రవేశం కల్పించనున్నారు. వర్షం వచ్చినా ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మహిళల హాజరును ప్రోత్సహించేందుకు CRDA బృందాలు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానం పలికాయి. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణానికి ఇది ఒక చారిత్రాత్మక దశగా మారనుంది.
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
This website uses cookies.