
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో ఓ సదస్సులో పాల్గొనడం జరిగింది. విశాఖపట్నంలో మార్చి 3 4 తారీఖులలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు పేరుగాంచిన నగరాలలో పలు సదస్సులలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిన్న బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందని అన్నారు. ఏపీ పరిపాలన విశాఖ నుంచి జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో ఏపీకి విశాఖ ఒకటే రాజధాని అన్నట్టు పరోక్షంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా ఈ సదస్సులో విశాఖలో అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖే రాజధానిగా ద బెస్ట్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచి జరుగుతుంది. తమ ప్రభుత్వం నిర్ణయం కూడా ఇదే అని పేర్కొన్నారు. ఆల్రెడీ విశాఖపట్నంకి ఓడరేవు నగరం..కాస్మోపాలిటన్ సిటీగా మంచి గుర్తింపు ఉంది.
AP Finance Minister Buggana’s sensational comments indirectly saying that Visakha is the only capital
భవిష్యత్తులో విశాఖ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక కర్నూలు రెండో రాజధానిగా ఉండదు అక్కడ కేవలం హైకోర్టు ప్రధాన బెంచ్… ఉంటుంది అని పేర్కొన్నారు. దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలను అధికార పార్టీ తప్పుదోవ పట్టిస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముందు మూడు రాజధానులు అని మళ్లీ ఇప్పుడు విశాఖపట్నం ఏకైక రాజధాని అన్నట్టు బుగ్గన చేసిన వ్యాఖ్యలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చె నాయుడు ఖండించారు.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.