ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో ఓ సదస్సులో పాల్గొనడం జరిగింది. విశాఖపట్నంలో మార్చి 3 4 తారీఖులలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు పేరుగాంచిన నగరాలలో పలు సదస్సులలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిన్న బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందని అన్నారు. ఏపీ పరిపాలన విశాఖ నుంచి జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో ఏపీకి విశాఖ ఒకటే రాజధాని అన్నట్టు పరోక్షంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా ఈ సదస్సులో విశాఖలో అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖే రాజధానిగా ద బెస్ట్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచి జరుగుతుంది. తమ ప్రభుత్వం నిర్ణయం కూడా ఇదే అని పేర్కొన్నారు. ఆల్రెడీ విశాఖపట్నంకి ఓడరేవు నగరం..కాస్మోపాలిటన్ సిటీగా మంచి గుర్తింపు ఉంది.
భవిష్యత్తులో విశాఖ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక కర్నూలు రెండో రాజధానిగా ఉండదు అక్కడ కేవలం హైకోర్టు ప్రధాన బెంచ్… ఉంటుంది అని పేర్కొన్నారు. దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలను అధికార పార్టీ తప్పుదోవ పట్టిస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముందు మూడు రాజధానులు అని మళ్లీ ఇప్పుడు విశాఖపట్నం ఏకైక రాజధాని అన్నట్టు బుగ్గన చేసిన వ్యాఖ్యలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చె నాయుడు ఖండించారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.