Venu Swamy : ఇకపై రాజకీయాలు, క్రికెట్ గురించి జాతకాలు చెప్పబోను... కారణం అదే... వేణు స్వామి...!
Venu Swamy : భారతదేశంలో ఇటీవల ఐపిఎల్ సీజన్ ఎంతో ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్కత్తా నైట్ రైడర్స్ ఫైనల్ వరకు చేరుకున్నాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పై కోల్కత్తా నైట్ రైడర్స్ ఘనవిజయం సాధించింది. అయితే ఎప్పుడూ కూడా సెలబ్రిటీల జాతకాలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారే వేణు స్వామి ఈసారి ఓ ఇంటర్వ్యూలో భాగంగా క్రికెట్ గురించి మాట్లాడుతూ ఈసారి ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని తెలియజేశారు.
ఈ ఏడది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య జాతకం చాలా బాగుందని అందుకే ఈసారి హైదరాబాద్ టీమ్ మంచి ఫామ్ లో కనిపిస్తుందని ఇక వారిని ఎవరు ఆపలేరని కచ్చితంగా కప్ కొడతారంటూ వేణు స్వామి తెలియజేశారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కత్తా నైట్ రైడర్స్ పై దారుణంగా ఓటమి పాలు కావడంతో సోషల్ మీడియాలో వేణు స్వామి పై విపరీతంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాక వేణు స్వామి చెప్పే మాటలు అబద్దాలని అతను చెప్పేవి జరగవు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇక ఈ ట్రోలింగ్ పై వేణు స్వామి కూడా స్పందిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మంచి ఫామ్ లో కనిపిస్తుందని అలాగే కావ్య జాతకం ప్రకారం గెలిచే అవకాశం ఉందని చెప్పాను కానీ కచ్చితంగా గెలుస్తుందని నేను ఎక్కడా చెప్పలేదని వేణు స్వామి స్పష్టం చేశారు.
Venu Swamy : ఇకపై రాజకీయాలు, క్రికెట్ గురించి జాతకాలు చెప్పబోను… కారణం అదే… వేణు స్వామి…!
ఒక జ్యోతిష్యుడుగా ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే నేను నా వృత్తి రీత్యా జాతకాలను చెబుతూ జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ వెళ్తానని ఎవరు ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసిన జరిగేవి జరుగుతూనే ఉంటాయంటూ వేణు స్వామి తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఇకపై క్రికెట్ గురించి జాతకాలు చెప్పబోనని తెలిపారు. క్రికెట్ గురించి బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా నేను ఎలాంటి జ్యోతిష్యాలు చెప్పనని ఎవరైనా పర్సనల్ గా వచ్చి అడిగితే చెబుతానంటూ వేణు స్వామి స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.