Avinash Reddy : వినుకొండలో జరిగిన రషీద్ హత్యోదంతాన్ని రాజకీయాన్ని చేయాలని చూస్తుంది వైసీపీ. వైసీపీ కార్య కర్త రషీద్ ను హత్య చేసినా ఉదంతంలో టీడీపీపై వైసీపీ ఎటాక్ చేస్తుంది. ఐతే అది రాజకీయ హత్య కాదని అంటున్నా సరే వైసీపీ పదే పదే ఆ మాట అంటుంది. రషీద్ మృతి విషయం తెలుసుకుని వైఎస్ జగన్ వినుకొండ వెళ్లి మరి అతని ఫ్యామిలీ పరామర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలు జరగడం దురదృష్టకరమని అన్నారు. అంతేకాదు రాష్ట్రపతి పాలన రావాలని.. ఈ ప్రభుత్వం ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని అన్నారు. ఐతే ఇప్పుడు ఈ ఇష్యూపై అవినాష్ రెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని.. వారు ఈ రాష్ట్రాన్ని బీహార్ కంటే ఘోరంగా చ్సేలా ఉన్నారని అన్నారు. రషీద్ హత్యపై అవినాష్ రెడ్డి స్పందించడం చూసి టీడీపీ వర్గాలు అతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అందరి వేళ్లు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. అలాంటి ఆయన హత్యల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్న వేళ ఇలా అతను వచ్చి రషీద్ హత్య గురించి ఇది రాజకీయ హత్య అని.. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది.
రషీద్ హత్య కేసుని కంప్లీట్ గా వైసీపీ రాజకీయ హత్య అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తుంది. ఐతే నిజా నిజాలు ఏంటి అన్నది నిత్య వార్తల్లో తెలుసుకుంటున్న ప్రజలు అటు వైసీపీ చెబుతున్న విషయాలను.. ఇటు టీడీపీ చేస్తున్న కామెంట్స్ ని నిర్ధారించుకుంటున్నారు. బాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారన్న అవినాష్ మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.