Balakrishna : రోజాపై సెటైరికల్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ…!

Advertisement
Advertisement

Balakrishna : టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుకు చేరిన సందర్భంగా విజయనగరంలో నవశకం పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ .. నటులు కేవలం సినిమాలకే పరిమితం కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు ఎక్కువగా ప్రజల్లో సభల్లో చూస్తున్నాను. సినిమాలతో వచ్చిన ఆదరణ అభిమానాన్ని ప్రజల కు ఉపయోగపడేలా ఉండాలి. నటులుగానే కాదు సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని అన్నారు. దీంతో అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మాటలకు నవ్వుకున్నారు. ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ .. నవ శకం అంతం కాదు ఇది ఆరంభమని తేల్చి చెప్పారు. జగన్ ప్రభుత్వం పై పోరాటానికి సమయం లేదు. విజయమో వీర స్వర్గమో ఇక తెచ్చుకోవాల్సిందేనని బాలకృష్ణ స్పష్టం చేశారు. లోకేష్ యువగళం ప్రజాగణంగా కలం తొక్కిందని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై జనసేన అధినేత పోరాడుతున్నారని స్పష్టం చేశారు.

Advertisement

ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చారని పోలవరాన్ని పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వం వైయస్సార్సీపి ప్రభుత్వం అని బాలకృష్ణ అన్నారు. డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారని విమర్శించారు. ల్యాండ్, స్యాండ్ స్కాములలో కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా భూములు ఇచ్చిన రైతుల ఉద్యమాలను అణిచివేశారని, రాజధాని కోసం పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపి అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉంది అన్నారు. ఉచిత పథకాల మాయలో ప్రజలు పడవద్దని బాలకృష్ణ సూచించారు.

Advertisement

రాష్ట్ర భవిష్యత్తును సైకో జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం దొరకట్లేదని ప్రజలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. ఒక్క ఛాన్స్ పేరుతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతిలో కప్పలా తాడేపల్లి ప్యాలెస్ తన సర్వస్వం అని జగన్ అనుకుంటున్నాడని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అక్రమాలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాటం అభినందనీయమని బాలయ్య కొనియాడారు. పవన్ కళ్యాణ్ తాను ఇద్దరం ముక్కుసూటి మనుషులమే ఇకపై ఉద్యమం చేస్తామని బాలకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వానికి ఇంకా కొన్ని రోజులే ఉందని ప్రజలు సైకో జగన్ కు తగిన బుద్ధి చెబుతారని బాలకృష్ణ అన్నారు.

Advertisement
Advertisement

Recent Posts

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

7 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

8 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

9 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

9 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

10 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

11 hours ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

12 hours ago