
Chandra Babu Naidu : పబ్ లో డాన్సులు వేసిన రోజాపై చంద్రబాబు నాయుడు జబర్దస్త్ పంచులు... !!
Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా..కదలిరా పేరుతో బహిరంగ సభను ఇటీవల ఏర్పాటు చేశారు.ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన బహిరంగ సభకు చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, జిల్లా కోఆర్డినేటర్లు, పార్టీ ఇన్చార్జీలు పాల్గొన్నారు.అన్ని విధాల నష్టపోయిన ఏపీని కాపాడుకునేందుకు ప్రజలందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ గా ఉండాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుందని కితాబు ఇచ్చారు. రైతులు బ్రతుకులు మారాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. మరో మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుంది అని అన్నారు. యువతకు ఉద్యోగ భృతి కల్పిస్తామని, భవిష్యత్తుకు నేను గ్యారెంటీ ఇస్తున్న అని యువతను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలోని యువతను ప్రపంచంలో నెంబర్ వన్ గా మారుస్తానని చెప్పారు.
ఇక వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో సమర్థవంతమైన మంత్రులు లేరని ఎద్దేవా చేశారు. క్లబ్బులో డాన్సులు వేసే రోజా మహిళా మంత్రి అని ఎద్దేవా చేశారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి తన సొంత ఎమ్మెల్యేలను నమ్మటం లేదని, అందుకే వాళ్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా తీసేసారని, దీంతో ఎమ్మెల్యేలంతా పారిపోతున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రజలు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదని, ఆయన మాత్రం ఎమ్మెల్యేలను నమ్మడం లేదని అన్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిత్యవసర ధరలు పెరిగిపోయాయి అని చెప్పారుష టమాటాకు, పొటాటో తేడా తెలియని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.
మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేశారన్నారు. ఒకప్పుడు సైబరాబాద్ లో డెవలప్ చేయకుంటే ఇప్పుడు హైదరాబాద్ అలా అభివృద్ధి అయ్యేది కాదని అన్నారు. రాజధాని లేకుండా ఐదేళ్లు పాలించాడని అన్నారు..తాము అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం దిగజారిందని చంద్రబాబు మండిపడ్డారు. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చంద్రబాబు వెల్లడించారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
This website uses cookies.