
Chandrababu : కక్ష్య సాధింపులకి సమయం కాదన్న ఆ ముగ్గురు.. నిజంగానే అలా ఉంటారా...!
Chandrababu : ఈ సారి ఏపీ ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉంటాయని ముందు నుండి అందరు భావించారు. కాని రిజల్ట్స్ తో పాటు ఎన్నికల ఫలితాలు కూడా ఇంట్రెస్టింగ్గా మారాయి.రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడంతో చాలా మంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. అయితే జూన్ 5 న ఆ విజయాన్ని హర్షిస్తూ టీ, కాఫీని ఉచితంగా పంపిణీ చేశాడు ఓ టీకొట్టు యజమాని. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందుకే టీ, కాఫీని ఉచితంగా పంపిణీ చేస్తున్నానని చెప్పాడు.ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో చోటు చేసుకుంది.
అయితే ఏది ఎలా ఉన్నా కూడా కూటమి నాయకులు ప్రజలకి మంచి చేసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూటమిని చాలా ఇబ్బంది పెట్టిన కూడా తాము మాత్రం కక్ష సాధింపులకు ఇది సమయం కాదని, రాష్ట్ర పునర్ నిర్మాణమే ప్రధానం అంటున్నారు ..చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్. ఎన్నికల్లో దిగ్విజయం సాధించిన తర్వాత వేర్వేరు సందర్భాల్లో మీడియాతోనూ, కార్యకర్తలతోనూ మాట్లాడిన ముగ్గురు నేతలు ప్రతిపక్షంపై కక్ష సాధించడం తమ లక్ష్యం కాదని తేల్చి చెప్పారు. ”వైసీపీ కానీ, జగన్ కానీ.. వ్యక్తిగతంగా నాకు శత్రువులు కారు. జనసేన నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది కక్ష సాధింపులకు సమయం కాదు. 5కోట్ల మంది ప్రజల కోసం పని చేసే సమయం ఇది” అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
Chandrababu : కక్ష్య సాధింపులకి సమయం కాదన్న ఆ ముగ్గురు.. నిజంగానే అలా ఉంటారా…!
”కక్ష సాధింపులు, వేధింపులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం.. మాకు రాదు. మేము చేయం. ఇదంతా ఆ పార్టీకి తెలిసింది. అందుకే ప్రజలు ఇవాళ ఇలాంటి తీర్పు ఇచ్చారు. మాపై బాధ్యత మరింత పెరిగింది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన అవసరం మా మూడు పార్టీలపైన ఉంది. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎవరికీ రాని విజయం, మెజార్టీ మాకు వచ్చింది. మా బాధ్యత మేము నెరవేర్చాలి. హుందాగా, ప్రజలకు ఇక్వ కక్ష్య సాధింపులకి పాల్పడేది లేదు. ప్రజలకి సేవ చేసే విధంగా పని చేస్తాం అని లోకేష్ స్పష్టం చేశారు. కక్ష సాధింపులకు పాల్పడేది లేదు. వ్యవస్థలను కాపాడటమే లక్ష్యం. ప్రజా శ్రేయస్సు కోసమే అధికారం. కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చిన మాటను, ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. జగన్ ను ఓడించడం కాదు, జగన్ ను వద్దే వద్దు అని ప్రజలు భావించారు. అందుకు ఈ ఫలితాలు నిదర్శనం” అని చంద్రబాబు అన్నారు. ముగ్గురు నాయకులు రాష్ట్ర అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేసారని వాళ్ల మాటల బట్టి అర్ధమవుతుంది.
Summer Business Idea : వేసవి కాలం వచ్చేసింది.. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఎండల్లో…
PM Kisan 23rd installment : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి, పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…
Gold Silver Rate April 6th 2026 : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పసిడి ధరలకు…
Karthika Deepam 2 April 6th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్లో ప్రసారం అవుతూ,…
Summer Buttermilk : ఎండలు మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగను మించిన పానీయం మరొకటి లేదు. సాధారణంగా మజ్జిగ…
Mango : వేసవి కాలం రాగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండు. అయితే పచ్చి మామిడికాయ మరియు…
Iced Tea Iced Coffee : వేసవి కాలంలో చల్లటి పానీయాలు తాగడం అందరికీ ఇష్టమే కానీ బరువు తగ్గాలని…
Pakistan Iran : గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోవడం పాకిస్తాన్ పాలిట పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే…
Ration Cards : తెలంగాణలో అనర్హులైన రేషన్ కార్డుదారులపై ప్రభుత్వాలు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యాయి. నిరుపేదల కోసం ఉద్దేశించిన ఉచిత…
Chicken Prices : నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా మండిపోతున్న చికెన్ ధరలు ఎట్టకేలకు…
India Masterstroke: సముద్ర మార్గాల ద్వారా సాగే ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తిరుగుతోంది. దశాబ్దాలుగా చమురు…
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.…
This website uses cookies.