cm ramesh to get central minister post
Chandrababu : ఇంకో మూడు నాలుగు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. అయితే.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పార్టీలో పలు మార్పులు చేసింది. ఎన్నికల వల్ల వేరే రాష్ట్రాలపై కూడా ప్రభావం ఉంటుంది అని భావించి పలు మార్పులు చేర్పులు చేపట్టింది. తెలంగాణ, ఏపీలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చింది బీజేపీ. బీజేపీతో పాటు వేరే పార్టీలు కూడా నాయకత్వంలో పలు మార్పులు చేస్తున్నాయి.
అయితే.. త్వరలో కేంద్రంలో మోదీ కేబినేట్ ను విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినేట్ విస్తరణలో భాగంగా.. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణ, ఏపీలో కూడా ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే.. తెలంగాణలో కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు. కానీ.. ఆయన్ను బీజేపీ అధ్యక్షుడిగా చేయడంతో ఆయన పదవిని తీసేసి.. బండి సంజయ్ కి కేబినేట్ లో చోటు కల్పించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే కే. లక్ష్మణ్ కు కానీ మోదీ కేబినేట్ లో చోటు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రం చోటు దక్కనుంది.ఇక.. ఏపీ నుంచి చూసుకుంటే సీఎం రమేశ్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి సీఎం రమేశ్ అంతగా బీజేపీలో యాక్టివ్ గా ఉండరు కానీ.. ఆయన పార్టీకి ఆర్థికంగా సాయం చేస్తుంటారు.
cm ramesh to get central minister post
ఇటీవల కర్ణాటక ఎన్నికల్లోనూ తన వంతుగా కొంత డబ్బు పంపించినట్టు తెలుస్తోంది. అలాగే.. ఏపీలో బీజేపీ సీనియర్ నేతలు ఎవరు పర్యటించినా సీఎం రమేశ్ దగ్గరుండి చూసుకుంటారు. ఇటీవల అమిత్ షా, జేపీ నడ్డా వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఆ వ్యవహారాన్ని సీఎం రమేశ్ చూసుకున్నారు. ఆయనకు బీజేపీ హైకమాండ్ లో మంచి పేరే ఉంది. అందుకే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. సీఎం రమేశ్ ఎవరో కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు క్లోజ్ ఫ్రెండ్. ఒకవేళ సీఎం రమేశ్ కు కేంద్ర మంత్రి పదవి వస్తే అది టీడీపీకి ప్లస్ అవుతుంది. అందుకే టీడీపీ శ్రేణులు తెగ సంతోషంలో ఉన్నారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.