
Daggubati Purandeswari : పవన్ కళ్యాణ్ పొత్తు కోసం చేసిన త్యాగానికి దండం పెట్టాలి.. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..!
Daggubati Purandeswari : ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు మూడు పార్టీలు పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేశాయి. పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం సంతోషం అన్నారు. అయితే సీట్ల సర్దుబాటుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. శ్రీరాముడికి ఆంజనేయుడు, విభీషణుడు, జాంబవంతుడు, ఉడత సాయం ఎలా అవసరమైందో ఏపీలో అరాచక పాలన అంతం చేయడానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని స్పష్టం చేశారు.
మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని పురందేశ్వరి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు అంశంపై అభిప్రాయ సేకరణకు రెండు బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని వారంతా పొత్తులను అర్థం చేసుకుంటారని పురందేశ్వరి అన్నారు. అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే 8 నియోజకవర్గాలు బీజేపీ అభ్యర్థుల ఎంపిక కూడా ఉండవచ్చు అని తెలుస్తుంది. జనసేన బీజేపీ కి 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. మిగిలిన 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అయితే 25 లోక్ సభ స్థానాల్లో 8 సీట్లను బీజేపీ జనసేనకు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తుంది.
8 సీట్లలో బీజేపీ ఆరు స్థానాల్లో జనసేన రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన ఆరు చోట్ల బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ లోక్ సభ సీట్లపై మాత్రమే దృష్టి సారించిందని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ పొత్తు లో పూర్తిస్థాయిలో అసెంబ్లీ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో క్లారిటీ రాలేదు. లోకసభ స్థానం అయితే కాకినాడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. వీటిపై మారింత స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీతో పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఆలస్యమైనట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ అసెంబ్లీ స్థానాల కంటే లోక్ సభ స్థానాలపై ఎక్కువ దృష్టి సారించినట్లుగా ఉంది. 6 లోక్ సభ స్థానాలను బీజేపీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ స్థానాల్లో జనసేన, బీజేపీకి 30 సీట్లను ప్రకటించింది అందులో 24 సీట్లు జనసేన మిగిలినవి బీజేపీకి ఖరారైనవి.
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్లో నివసిస్తున్న…
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
This website uses cookies.