Categories: andhra pradeshNews

TTD : జ‌గ‌న్‌కి టీటీడీ పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిందిగా.. తిరుమ‌ల‌లో సాక్షిపై ఎఫ్ఐఆర్..!

TTD : ఇటీవ‌ల తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, దీనిపై అధికార ప్ర‌తిప‌క్షాలు చాలా హ‌డావిడి చేశాయి. ఇక ప్ర‌స్తుతం తిరుమ‌లలో బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదయింది. టీటీడీ ఫిర్యాదు మేరకు సాక్షి యాజమాన్యంపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ ఫిర్యాదు చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నెల 5న టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షకు సంబంధించి సాక్షి పత్రికలో అసత్య కథనాన్ని ప్రచురించిందని ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

TTD సాక్షిపై కేసు..

ఈ ఫిర్యాదు ఆధారంగా సాక్షి యాజమాన్యంపై బీఎస్ఎస్ సెక్షన్లు 353(2), 356, 196(1)(ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది.6వ తేదీ సాక్షి ప్రధాన పత్రిక 13వ పేజీలో ‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంలో అన్నీ అసత్యాలే ఉన్నాయని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిలో మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా.. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పటయ్యే సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకేమాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి’ అని చంద్రబాబు సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్లుగా ప్రచురించారని ఆయన పేర్కొన్నారు. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే అసత్యాన్ని ప్రచురించిందని, సాక్షి దినపత్రిక యాజమాన్యం, నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో కోరారు.

TTD : జ‌గ‌న్‌కి టీటీడీ పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిందిగా.. తిరుమ‌ల‌లో సాక్షిపై ఎఫ్ఐఆర్..!

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల చేరుకొని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంలో కొన్ని శాఖల అధికారులు కూడా ఆ సమావేశానికి హాజరు అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష పై చెప్ప‌ని విష‌యాలు కూడా సాక్షి ప్ర‌చురించ‌డంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో సాక్షి దినపత్రిక యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు కావడం తీవ్ర చర్చకు దారితీసింది.

Recent Posts

Good News : ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌… ఒక్కొక్క‌రికి ల‌క్ష‌..!

Good News : ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శుభవార్త. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు చేసుకున్న…

22 minutes ago

Kavitha : కవిత కు కొత్త చిక్కులు..!

Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…

1 hour ago

Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? – రాజగోపాల్

Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…

2 hours ago

Pulivendula Zptc : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి!

Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…

3 hours ago

Turmeric Water Bath : ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కలపండి.. ఆ తరువాత జరిగే అద్భుతం తెలిస్తే షాకే…?

Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…

4 hours ago

Uppal : ఫ‌లించిన ప‌ర‌మేశ‌న్న కృషి.. మంత్రి ఆదేశాల‌తో జీహెచ్ఎంసీ చేతికి ఉప్ప‌ల్‌ ర‌హ‌దారి ప‌నులు..!

Uppal  : ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫ‌లించింది. ఫ‌లితంగా…

5 hours ago

Today Gold Rates : మ‌హిళ‌ల‌కు శుభవార్త.. భారీ త‌గ్గిన బంగారం , వెండి ధ‌ర‌లు..!

Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం…

6 hours ago

Mutton Bone Soup : విరిగిన ఎముకలు తిరిగి అతకాలంటే మటన్ సూపు తాగాలా… ఇది ఎంతవరకు నిజం…?

Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ…

6 hours ago