Categories: andhra pradeshNews

TTD : జ‌గ‌న్‌కి టీటీడీ పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిందిగా.. తిరుమ‌ల‌లో సాక్షిపై ఎఫ్ఐఆర్..!

Advertisement
Advertisement

TTD : ఇటీవ‌ల తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, దీనిపై అధికార ప్ర‌తిప‌క్షాలు చాలా హ‌డావిడి చేశాయి. ఇక ప్ర‌స్తుతం తిరుమ‌లలో బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదయింది. టీటీడీ ఫిర్యాదు మేరకు సాక్షి యాజమాన్యంపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ ఫిర్యాదు చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నెల 5న టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షకు సంబంధించి సాక్షి పత్రికలో అసత్య కథనాన్ని ప్రచురించిందని ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

TTD సాక్షిపై కేసు..

ఈ ఫిర్యాదు ఆధారంగా సాక్షి యాజమాన్యంపై బీఎస్ఎస్ సెక్షన్లు 353(2), 356, 196(1)(ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది.6వ తేదీ సాక్షి ప్రధాన పత్రిక 13వ పేజీలో ‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంలో అన్నీ అసత్యాలే ఉన్నాయని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిలో మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా.. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పటయ్యే సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకేమాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి’ అని చంద్రబాబు సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్లుగా ప్రచురించారని ఆయన పేర్కొన్నారు. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే అసత్యాన్ని ప్రచురించిందని, సాక్షి దినపత్రిక యాజమాన్యం, నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో కోరారు.

Advertisement

TTD : జ‌గ‌న్‌కి టీటీడీ పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిందిగా.. తిరుమ‌ల‌లో సాక్షిపై ఎఫ్ఐఆర్..!

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల చేరుకొని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంలో కొన్ని శాఖల అధికారులు కూడా ఆ సమావేశానికి హాజరు అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష పై చెప్ప‌ని విష‌యాలు కూడా సాక్షి ప్ర‌చురించ‌డంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో సాక్షి దినపత్రిక యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు కావడం తీవ్ర చర్చకు దారితీసింది.

Advertisement

Recent Posts

Eatala Rajender : కేంద్రంలో ఎంపీ ఈటల రాజేంద‌ర్‌కు కీలక పదవి..!

Eatala Rajender : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌సభ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసేస్ ఆఫ్ ప్రాఫిట్‌…

5 hours ago

pawan kalyan : రాజ‌కీయంగా ప‌వ‌న్ అజ్ఞాని అనుకుంటే బొక్క‌బోర్లా ప‌డ్డ‌టే.. స‌నాత‌నం వెన‌క అంత ప్లానా..!

pawan kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ గా మారాడు.ఆయ‌న ప‌ది సంవ‌త్స‌రాలుగా అధికారం…

6 hours ago

Vijayasai Reddy : ఏపీలో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా.. అది మ‌ర‌ల్చ‌డానికే ల‌డ్డూ వివాద‌మా?

Vijayasai Reddy : ఇటీవ‌ల ప్ర‌తి రాష్ట్రంలో కూడా ఎన్నిక‌లు చాలా ఆస‌క్తిక‌రంగా మారాయి. తెలంగాణ‌, ఏపీ ఎన్నిక‌లు రంజుగా…

7 hours ago

Divvala Madhuri : మాడ వీధుల్లో వెడ్డింగ్ షూట్ అంటూ వార్త‌లు.. ఓ రేంజ్ లో ఫైర్ అయిన మాధురి..!

Divvala Madhuri : టెక్కలి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నారు.…

8 hours ago

Nara Lokesh : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌మానంగా లోకేశ్‌.. త్వ‌ర‌లో డిప్యూటీ సీఎం ప‌ద‌వి ?

Nara Lokesh : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏర్ప‌డ్డ కూటమి ప్రభుత్వంలో త్వరలోనే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తుంది. జ‌న‌సేన అధినేత‌,…

9 hours ago

ITBP Recruitment : ITBP డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 545 ఖాళీల భ‌ర్తీకి దరఖాస్తుల ఆహ్వానం…!

ITBP Recruitment : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 545 ఖాళీలతో కానిస్టేబుల్ (డ్రైవర్) కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఆసక్తి…

10 hours ago

Modi : ప్ర‌ధానితో చంద్ర‌బాబు కీల‌క చ‌ర్చ‌లు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చారుగా..!

Modi : కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఏపీలో సానుకూలంగా ఏవి పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కేంద్రం నుండి ఏపీకి వ‌చ్చిన…

11 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో ఉప్పు ప్యాకెట్ ఖ‌రీదు రూ.50 వేలా.. న‌య‌ని పావని ఎందుక‌లా ఏడ్చింది..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఇప్పుడు మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. వైల్డ్…

12 hours ago

This website uses cookies.