YS Jagan : ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఇంతలా చేయడం లేదు. అంత సాయం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. కేవలం ఉద్యోగుల జీతాల కోసం ప్రతి సంవత్సరం రూ.83 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కాకముందు సీఎం జగన్ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను జగన్ నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు.
ఏదో ఎన్నికల కోసం అల్లా టప్పా నిర్ణయాలు తీసుకోవడం వైసీపీకి తెలియదని.. ఉద్యోగుల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యం అని ధర్మాన ప్రసాద రావు అన్నారు. అందుకే.. ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలిగేలా.. సీపీఎస్ బదులు జీపీఎస్ ను తీసుకొచ్చామని, వాళ్ల జీవన ప్రమాణాలను కాపాడామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగుల కోసం ఇంత చేస్తుంది కాబట్టి ప్రభుత్వం చేసే మంచిని ఉద్యోగులు గొంతు విప్పి చెప్పాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని మంత్రి తెలిపారు.
వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ఇవ్వాలి. అండగా ఉండాలి. అప్పుడు మరిన్ని మార్పులు సాధ్యం అవుతాయి అని మంత్రి స్పష్టం చేశారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే.. మరిన్ని పాలనా పరమైన సంస్కరణలను తీసుకొస్తామని మంత్రి తెలిపారు. అంటే.. మంత్రి ధర్మాన డైరెక్ట్ గానే వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెబుతున్నారా? మరి.. మంత్రి పిలుపును ఉద్యోగులు ఎలా చూసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.