YS Jagan : తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అది మూలధన పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన ప్రకటన. రాష్ట్రాలకు సంబంధించి.. మూలధన పెట్టుబడి ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. దేశంలోని 16 రాష్ట్రాలకు సుమారు రూ.56,415 కోట్ల మూలధన పెట్టుబడి మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. ఇవి మూలధన పెట్టుబడి కోసం విడుదల చేసినవి. మూలధన పెట్టుబడి అంటే పలు రంగాల అభివృద్ధికి వాటిని ఉపయోగించవచ్చు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, నీటి పారుదల, నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, కాజ్ వే, వంతెనల నిర్వహణ, రైల్వేల క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ప్రాజెక్టులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రాష్ట్రాల వాటా కింద ఆ నిధులను విడుదల చేసింది. అవి ఆయా రంగాల్లో నిర్మాణ పనుల వేగాన్ని పెంచడానికి ఉపయోగపడనున్నాయి. ప్రతి సంవత్సరం మూల ధన వ్యయాలను ప్రోత్సహించడం కోసం కేంద్రం.. వార్షిక బడ్జెట్ లో ఈ నిధులను కేటాయిస్తుంది. తాజాగా 2023 – 24 కి సంబంధించిన సాయాన్ని విడుదల చేసింది.
తాజాగా 16 రాష్ట్రాలకు నిధులను కేంద్రం విడుదల చేసింది. అందులో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఉంది కానీ.. ఏపీ మాత్రం లేదు. తెలంగాణకు రూ.2120 కోట్లను కేంద్ర విడుదల చేసింది. సౌత్ ఇండియాలో చూసుకుంటే తమిళనాడుకు రూ.4079 కోట్లు, కర్ణాటకకు రూ.3647 కోట్లు ప్రకటించింది. ఏపీతో పాటు అందులో మహారాష్ట్ర పేరు కూడా లేదు. కేరళ రాష్ట్రం పేరు కూడా లేదు. ఢిల్లీ, అస్సాం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల పేర్లు కూడా లేవు. దీనిపై కేంద్రం.. ఏపీ ప్రజలకు ఎలాంటి సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.