AP New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం.. ఎవరికీ ఇవ్వబోతున్నారంటే!!
AP New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్తను కోల్పోయిన వితంతువులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 89,788 వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ పెన్షన్లను మే 1వ తేదీ నుండి లబ్ధిదారులకు అందించనున్నారు. కొత్తగా దరఖాస్తు చేసిన వారు జూన్ 1వ తేదీ నుండి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. వితంతు కేటగిరీలో తప్పకుండా అర్హులు మాత్రమే లబ్ధిదారుల జాబితాలోకి చేరేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసింది.
AP New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం.. ఎవరికీ ఇవ్వబోతున్నారంటే!!
పెన్షన్ మంజూరులో అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో దివ్యాంగుల కేటగిరీలో అనేక బోగస్ ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు గుర్తించి, వాటిపై ఇప్పటికే రీ-అసెస్మెంట్ ప్రక్రియ మొదలుపెట్టారు. స్పౌజ్ పెన్షన్ కోసం దరఖాస్తులను వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా స్వీకరిస్తారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసిన వారికి మే 1న పెన్షన్ డబ్బులు అందనుండగా, మిగిలిన వారికి జూన్ 1 నుండి చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఈ చర్యతో ప్రభుత్వంపై రూ. 35.91 కోట్ల అదనపు భారం పడనుంది.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరంతరాయంగా పెన్షన్ల మంజూరు జరిగేది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చి, ఆరు నెలలకు ఒకసారి మాత్రమే పెన్షన్ల జాబితా సిద్ధం చేసే విధానంకి మారింది. దీంతో అనేక అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఆలస్యమైంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో పెన్షన్ నిలిచిపోయిన వారికి మళ్ళీ అవకాశాలు లభించనున్నాయి. అలాగే జులై నెల నుంచి కొత్తగా ఇతర కేటగిరీల కింద దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానుంది. కొత్తగా 6 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశముందని అంచనా. ఇది పేదల జీవితాలలో ఆర్థిక స్థిరత తీసుకురానుంది.
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
This website uses cookies.