
Gummanur Jayaram : పార్టీ మారగానే గట్టిదెబ్బ .. టీడీపీ లోకి వెళ్లిన గుమ్మనూరి జయరాం..!
Gummanur Jayaram : ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతుంది.ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు ఒక పార్టీలో నుంచి మరొక పార్టీలోకి చేరుతున్నారు.ఇప్పటికే చాలా మంది లీడర్లు పార్టీలు మారిన సంగతి తెలిసిందే.ఇంకా ఇప్పటికి పార్టీల మార్పు కొనసాగుతూనే ఉంది.అయితే వైసీపీ నుంచి బయటికి వచ్చిన వాళ్లంతా వైయస్ జగన్ తీరు నచ్చడం లేదని బహిరంగంగా చెబుతున్నారు. టికెట్ ఇవ్వడం వేరు, వేరే చోట ఇవ్వడం వేరు, ఉన్న ప్రాంతంలో సర్వే బాలేదని వేరే వాళ్లకు సపోర్ట్ చేయమని చెప్పడం ఇవి మూడు వేర్వేరు అంశాలు. ఇలా వైసీపీలో సర్వేల ద్వారా చాలామందిని పక్కన పెట్టారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం పార్టీకి రాజీనామా చేయడం వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పాలి. అయితే ఆయనను పార్లమెంటుకు పంపించాలని వైయస్ జగన్ భావించారు అందుకు ఆయన నిరాకరించినట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బ్యాలెన్స్ చేయడం వైయస్ జగన్ కి ఛాలెంజింగ్ గా మారింది. ఏదేమైనా సింగిల్గానే వైయస్ జగన్ తన పార్టీ ఎజెండాను మార్చుకోగలిగారు.
ఇక గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అయితే వైసీపీ క్యాడర్ అంత అందుకు విరుద్ధంగా మారుతున్నారు. తాము వైసీపీలోనే ఉంటామని, టీడీపీలోకి రామని తేల్చి చెబుతున్నారు. గుమ్మనూరు జయరాం పొంతకల్ నుంచి పోటీ చేయాలని హై కమాండ్ భావించింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు. దీంతో పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది. అయితే క్యాడర్ ఎంత వేరే చోట నుంచి పోటీ చేస్తే ఏమవుతుంది, ఇన్నాళ్లు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వెళ్లడం సరైనది కాదని, మేమంతా వైసీపీ లోనే ఉంటామని క్యాడర్ తేల్చి చెబుతున్నారు. దీంతో గుమ్మనూరు జయరామ్ ను ఆయన వర్గీయులే వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి వైయస్ జగన్ విధానాలు నచ్చలేదని బహిరంగంగా చెప్పి టీడీపీలోకి చేరారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీ నుంచి పొంతకల్ నుంచి పోటీ చేస్తానని, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అనే ఇద్దరు పూజారులు ఉన్నారని, దాంతో వైఎస్ జగన్ శిల్పంలా మారారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నప్పుడు వైయస్ జగన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయని ఇలాంటి నాయకులు టికెట్ ఇవ్వలేదని బయటికి వచ్చి విమర్శలు చేయడం ఏమాత్రం సరి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదవి ఉన్నన్నాళ్ళు మాకు అంత బెనిఫిట్ గా ఉందని కబుర్లు చెబుతారు. టికెట్ ఇవ్వకపోయేసరికి ఇలాంటి విమర్శలు చేస్తుంటారు. వైసీపీ లోనే కాదు అటు టీడీపీలో కూడా ఇలాంటి నాయకులు ఉన్నారు. రాష్ట్రం ప్రజల గురించి ఆలోచించడం పక్కన పెట్టి వారి పదవుల కోసం పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులకు ప్రజలు ఎటువంటి సమాధానం చెబుతారు చూడాలి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
This website uses cookies.