Gummanur Jayaram : పార్టీ మారగానే గట్టిదెబ్బ .. టీడీపీ లోకి వెళ్లిన గుమ్మనూరి జయరాం..!

Gummanur Jayaram : ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతుంది.ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు ఒక పార్టీలో నుంచి మరొక పార్టీలోకి చేరుతున్నారు.ఇప్పటికే చాలా మంది లీడర్లు పార్టీలు మారిన సంగతి తెలిసిందే.ఇంకా ఇప్పటికి పార్టీల మార్పు కొనసాగుతూనే ఉంది.అయితే వైసీపీ నుంచి బయటికి వచ్చిన వాళ్లంతా వైయస్ జగన్ తీరు నచ్చడం లేదని బహిరంగంగా చెబుతున్నారు. టికెట్ ఇవ్వడం వేరు, వేరే చోట ఇవ్వడం వేరు, ఉన్న ప్రాంతంలో సర్వే బాలేదని వేరే వాళ్లకు సపోర్ట్ చేయమని చెప్పడం ఇవి మూడు వేర్వేరు అంశాలు. ఇలా వైసీపీలో సర్వేల ద్వారా చాలామందిని పక్కన పెట్టారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం పార్టీకి రాజీనామా చేయడం వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పాలి. అయితే ఆయనను పార్లమెంటుకు పంపించాలని వైయస్ జగన్ భావించారు అందుకు ఆయన నిరాకరించినట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బ్యాలెన్స్ చేయడం వైయస్ జగన్ కి ఛాలెంజింగ్ గా మారింది. ఏదేమైనా సింగిల్గానే వైయస్ జగన్ తన పార్టీ ఎజెండాను మార్చుకోగలిగారు.

ఇక గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అయితే వైసీపీ క్యాడర్ అంత అందుకు విరుద్ధంగా మారుతున్నారు. తాము వైసీపీలోనే ఉంటామని, టీడీపీలోకి రామని తేల్చి చెబుతున్నారు. గుమ్మనూరు జయరాం పొంతకల్ నుంచి పోటీ చేయాలని హై కమాండ్ భావించింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు. దీంతో పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది. అయితే క్యాడర్ ఎంత వేరే చోట నుంచి పోటీ చేస్తే ఏమవుతుంది, ఇన్నాళ్లు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వెళ్లడం సరైనది కాదని, మేమంతా వైసీపీ లోనే ఉంటామని క్యాడర్ తేల్చి చెబుతున్నారు. దీంతో గుమ్మనూరు జయరామ్ ను ఆయన వర్గీయులే వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి వైయస్ జగన్ విధానాలు నచ్చలేదని బహిరంగంగా చెప్పి టీడీపీలోకి చేరారు.

ఈ పరిస్థితుల్లో టీడీపీ నుంచి పొంతకల్ నుంచి పోటీ చేస్తానని, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అనే ఇద్దరు పూజారులు ఉన్నారని, దాంతో వైఎస్ జగన్ శిల్పంలా మారారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నప్పుడు వైయస్ జగన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయని ఇలాంటి నాయకులు టికెట్ ఇవ్వలేదని బయటికి వచ్చి విమర్శలు చేయడం ఏమాత్రం సరి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదవి ఉన్నన్నాళ్ళు మాకు అంత బెనిఫిట్ గా ఉందని కబుర్లు చెబుతారు. టికెట్ ఇవ్వకపోయేసరికి ఇలాంటి విమర్శలు చేస్తుంటారు. వైసీపీ లోనే కాదు అటు టీడీపీలో కూడా ఇలాంటి నాయకులు ఉన్నారు. రాష్ట్రం ప్రజల గురించి ఆలోచించడం పక్కన పెట్టి వారి పదవుల కోసం పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులకు ప్రజలు ఎటువంటి సమాధానం చెబుతారు చూడాలి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Recent Posts

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

3 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

4 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

7 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

10 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

22 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

1 day ago