
YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసులపై హైకోర్టు సీరియస్
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జరిగిన ఈ ఘటనలో, సింగయ్య అనే వ్యక్తి జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్ను రెండో నిందితుడిగా (ఏ-2) చేర్చడంపై ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా వేస్తారు?” అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసులపై హైకోర్టు సీరియస్
జగన్ తరఫు న్యాయవాదులు ఈ కేసును పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కారును మొదటగా గుర్తించి, తర్వాత దాన్ని జగన్ కారు అని మారుస్తూ కేసు నమోదు చేశారని వాదించారు. ఇది ప్రజలతో అనుసంధానాన్ని అడ్డుకునేందుకు, పరపతిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసారని కోర్టుకు వివరించారు. అంతేకాదు, జగన్ పర్యటనలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదని, ఈ అంశం పైన కూడా రెండు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
వాదనలన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం, ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో కేసును జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో, అప్పటి వరకు జగన్ సహా ఇతర నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
Fennel Seeds : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరం మరియు గ్యాస్…
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
India : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
This website uses cookies.