Pithapuram : ఏపీలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు ఎంత చర్చనీయాంశంగా మారాయో మనం చూశాం. ఇక పిఠాపురం అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఇక్కడి నుంచి పోటీకి దిగడమే దీనికి కారణం. పవన్ ను ఈసారి కూడా ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే ఈసారి పవన్ గెలుపుకు ఢోకా లేదనే చర్చ జరుగుతోంది. పవన్ ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు ఎంతోమంది పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పవన్ కు ప్రత్యర్థిగా వైసిపి నుంచి వంగ గీత పోటీ చేశారు.స్థానికంగా బలమైన నాయకురాలు కావడం , మహిళా సెంటిమెంటు ఇవన్నీ కలిసి వస్తాయని ఉద్దేశంతో జగన్ ఆమెను అభ్యర్థిగా నిలబెట్టారు.
పిఠాపురంలో వంగ గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి చేస్తానంటూ ఎన్నికల ప్రచారం చివరి రోజున పిఠాపురంలో నిర్వహించిన సభలో జగన్ హామీ ఇచ్చా రు.ఇతరులు ఎవరు గెలుస్తారనేది జూన్ 4వ తేదీన తేలిపోనుంది.ఇది ఇలా ఉంటే ఎన్నికల ఫలితాలు వెలబడకుండానే పిఠాపురంలో మరో హడావుడి నడుస్తోంది. ఈలోగా కొంతమంది అత్యుత్సాహవంతులు మాత్రం పిఠాపురంలో నేమ్ ప్లేట్లు, స్టిక్కర్లతో గోల గోల చేస్తున్నారు.ఎన్నికల్లో ఆమెకు జగన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం హామీని స్టిక్కర్లుగా మార్చి కార్లపై వేయించుకుని తిరుగుతున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దీనికి పోటీగా మరికొన్ని స్టిక్కర్లు వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఓ జనసేన అభిమాని తన బైక్ పై వేయించిన స్టిక్కర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సదరు జనసేన అభిమాని తన బైక్ పై నంబర్ ప్లేట్ స్ధానంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ స్టిక్కర్ అతికించాడు. కింద జనసేన గుర్తులతో డిజైన్ కూడా పెట్టుకున్నాడు. తద్వారా పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అనుచరుడనే అర్ధం వచ్చేలా ఈ స్టిక్కరింగ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రాకముందే పిఠాపురంలో పవన్ గెలిచినట్లే అని భావిస్తున్న అభిమానులు ఇలా తమకు నచ్చిన మార్గాల్లో అభిమానం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బైక్ స్టిక్కర్ ఫొటో వైరల్ అవుతోంది.పిఠాపురంలో ఎవరు గెలిచినా మెజార్టీ అతి స్వల్పంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వారం రోజుల్లో రిజల్ట్ రాబోతున్న దశలో అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. తమ నాయకులే గెలిచేశారని తేల్చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.