Home » Andhra Pradesh » Jagan And Pawan Kalyan Issue In Public Meetings
andhra pradesh

Jagan and pawan kalyan : పవన్ నాలుగో భార్య + జగన్ వదిన ….ఏంటి ఈ గోల…అసలేం జరిగిందంటే…

Authored By
Ramu
The Telugu News | Updated on: March 2, 2024, 8:04 pm
Advertisement

Jagan and pawan kalyan : ఒకప్పుడు రాజకీయాలు అంటే ప్రజలకు ఏ రకంగా మంచి చెయ్యాలి ఇక దానికి తక్కువ ఖర్చు ఎలా అవుతుంది అనే విషయాలపై రాజకీయ నాయకుల మధ్య పోటీ ఉండేది. ఆ తర్వాత కాలంలో ఎవరు ఎక్కువ మర్డర్లు చేస్తే ఎవరు ఎక్కువ గొడవలు చేస్తే వాళ్లు స్ట్రాంగ్ రాజకీయ నాయకులు అవుతారు అనే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు కొత్త ట్రెండు రాజకీయాల్లో కనిపిస్తుంది. అదేంటంటే ఎంత నీచంగా మాట్లాడుకుంటే అంత గొప్ప రాజకీయ నాయకుడు అని అంటున్నారు. ఇలాంటి రాజకీయాలు దేశం మొత్తంలో మనం చూస్తూనే ఉన్నాం కానీ నీచంలో అత్యంత నీచం చూడాలంటే ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవాలి. ఎంత వయసు వచ్చినా కూడా సీఎం పదవుల కోసం కోట్లాదిమంది ప్రజలకు రాజకీయ నాయకులు చెప్పేటువంటి వంకలు ఇంకెవరు చెప్పలేరు.

Advertisement

ఇక విషయంలోకి వెళ్తే వై.యస్ జగన్ వదిన పవన్ కళ్యాణ్ కి నాలుగవ పెళ్ళాం. పాలసీస్ గురించి మరి ఏదో దాని గురించి సమాధానం చెప్పలేని వైయస్ జగన్ అనేకసార్లు పవన్ కళ్యాణ్ యొక్క మూడు పెళ్లిళ్ల గురించి ముగ్గురు భార్యల గురించి మాట్లాడిన మాటలు వాస్తవమని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అది ఆయన విజ్ఞతకు దిగజారిపోయిన తనానికి వదిలేయాలి. కాని ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా నీచమైన వ్యాక్యాలు చేశారు. అదేంటంటే నాకు జరిగినవి మూడు పెళ్లిళ్లు కాని జగన్ నాకు నాలుగు పెళ్లిళ్లు అంటున్నాడు. అయితే ఆ నాలుగు పెళ్ళం నువ్వే జగన్ నా ఇంటికి రా అంటూ ఇటీవల తాడేపల్లి లో జరిగిన జెండా సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పాడు. దానితో అప్పటి నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే జనసేన పార్టీ ఫ్యాన్స్ “జగన్ వదిన” “జగన్ వదిన” అంటూ నువ్వే పవన్ కి నాలుగో భార్య అంటూ జగన్ ని ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీకి కోపం వచ్చింది. జగన్ నీకు నాలుగో పెళ్ళం కాదు. నీకు మొగుడు అని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. అయితే అసలు ఈ నాలుగో పెళ్ళాం ఏంటి అంటూ చాలామంది సందేహానికి గురవుతున్నారు. అంటే రాజకీయ నాయకులు చెప్పే సభలని అందరు వీక్షించరు కదా. దీంతో చాలామందికి నాలుగో పెళ్ళాం ఏంటి జగన్ వదిన ఏంటి అనే సందేహాలు బాగా వస్తున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నా పెళ్లిళ్ల గురించి నా భార్యల గురించి మాట్లాడుతున్నావు నువ్వే నా నాలుగో భార్య రారా జగన్ అంటూ మాట్లాడారు. ఇక దానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరితంగా చేశారు. ఈ రకమైనటువంటి నీచమైన పదజాలంతో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ రాజకీయ అధినేతలు ఎవరైతే మాట జారుతున్నారో ఆ మాటలని టక్కున నేతలు కూడా పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు.ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయని పలువురు తెలియజేస్తున్నారు. మరి దీనిపై మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి