Jagan : జగన్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పిన మరో సర్వే... కూటమి గెలుపు గల్లంతే...
Jagan : ఏపీలో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్ధం సభలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అంతేకాక జగన్ సిద్ధం సభలకు ప్రతి చోట ప్రజలందరూ జననీరాజనం పలుకుతున్నారు. ఇది ఇలా ఉంటే ఒంటరిగా జగన్ ను ఎదుర్కోవడం కష్టమని భావించిన విపక్ష పార్టీలు టీడీపీ జనసేన పోత్తుగా కలిసి ముందుకు వెళుతున్నాయి. ఇక ఈ పొత్తులో బీజేపీ కూడా ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ప్రముఖ జాతీయ సంస్థలు తాజాగా విడుదల చేసిన సర్వేలో కూడా అధికార వైసీపీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయి.
అయితే ఇప్పటికే టైమ్స్ నౌ , ఇండియా టీవీ, ఫుల్ స్ట్రాటజీ , పొలిటికల్ క్రిటిక్ వంటి సంస్థలు చేపట్టిన సర్వేలలో కూడా వైసీపీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అంతేకాక గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలు కూడా వైసీపీ పార్టీని గెలిపించేందుకే సిద్ధమవుతున్నారని సర్వేలో వెళ్లడైంది.
అయితే ఒకవైపు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ఆంధ్ర రాష్ట్రంలో వైసీప పార్టీ చాలా బలంగా ఉందని ఇక ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీకే అధికారం చేపడుతుందంటూ సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా జీ న్యూస్ సంస్థలతో పాటు మరో ప్రముఖ సంస్థ చేసినటువంటి సర్వేలో వచ్చిన ఫలితాలు టీడీపీ మరియు జనసేన నేతలలో గుబులు పుట్టిస్తున్నాయని చెప్పాలి. అయితే తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో జీ న్యూస్ మరియు మ్యాట్రిజ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలలో వైసీపీ పార్టీ 19 స్థానాలను సాధిస్తుందని తెలియజేశాయి. అయితే వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాలు దక్కించుకోగా ఈసారి 3 స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. అదేవిధంగా తెలుగుదేశం మరియు జనసేన కూటమి 6 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేశాయి.
అంతేకాక ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలలో వైసీపీ కాంగ్రెస్ పార్టీపై అసలు వ్యతిరేకత లేదని తెలియజేస్తున్నాయి. అంతేకాక సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి కి వెళ్లి అందిస్తుండడంతో ప్రజలందరూ కూడా జగన్ పాలన పైపే ఆసక్తి చూపిస్తున్నట్లుగా సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే వైసీపీ 133 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందట. అలాగే వైసీపీకి 48% ఓట్ షేర్ టీడీపీ జనసేనకు 44% ఓట్ షేర్ వస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా జనాధర్ ఇండియా సర్వే కూడా వైసీపీ పార్టీకి అధికారం ఖాయమని తెలియజేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం వైసీపీ పార్టీకి 125 సీట్లు , టీడీపీ జనసేన కూటమికి 50 సీట్లు వస్తాయని తెలిపింది. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సర్వేలో కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో వైసీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
This website uses cookies.