Jagan : జగన్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పిన మరో సర్వే... కూటమి గెలుపు గల్లంతే...
Jagan : ఏపీలో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్ధం సభలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అంతేకాక జగన్ సిద్ధం సభలకు ప్రతి చోట ప్రజలందరూ జననీరాజనం పలుకుతున్నారు. ఇది ఇలా ఉంటే ఒంటరిగా జగన్ ను ఎదుర్కోవడం కష్టమని భావించిన విపక్ష పార్టీలు టీడీపీ జనసేన పోత్తుగా కలిసి ముందుకు వెళుతున్నాయి. ఇక ఈ పొత్తులో బీజేపీ కూడా ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ప్రముఖ జాతీయ సంస్థలు తాజాగా విడుదల చేసిన సర్వేలో కూడా అధికార వైసీపీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయి.
అయితే ఇప్పటికే టైమ్స్ నౌ , ఇండియా టీవీ, ఫుల్ స్ట్రాటజీ , పొలిటికల్ క్రిటిక్ వంటి సంస్థలు చేపట్టిన సర్వేలలో కూడా వైసీపీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అంతేకాక గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలు కూడా వైసీపీ పార్టీని గెలిపించేందుకే సిద్ధమవుతున్నారని సర్వేలో వెళ్లడైంది.
అయితే ఒకవైపు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ఆంధ్ర రాష్ట్రంలో వైసీప పార్టీ చాలా బలంగా ఉందని ఇక ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీకే అధికారం చేపడుతుందంటూ సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా జీ న్యూస్ సంస్థలతో పాటు మరో ప్రముఖ సంస్థ చేసినటువంటి సర్వేలో వచ్చిన ఫలితాలు టీడీపీ మరియు జనసేన నేతలలో గుబులు పుట్టిస్తున్నాయని చెప్పాలి. అయితే తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో జీ న్యూస్ మరియు మ్యాట్రిజ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలలో వైసీపీ పార్టీ 19 స్థానాలను సాధిస్తుందని తెలియజేశాయి. అయితే వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాలు దక్కించుకోగా ఈసారి 3 స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. అదేవిధంగా తెలుగుదేశం మరియు జనసేన కూటమి 6 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేశాయి.
అంతేకాక ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలలో వైసీపీ కాంగ్రెస్ పార్టీపై అసలు వ్యతిరేకత లేదని తెలియజేస్తున్నాయి. అంతేకాక సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి కి వెళ్లి అందిస్తుండడంతో ప్రజలందరూ కూడా జగన్ పాలన పైపే ఆసక్తి చూపిస్తున్నట్లుగా సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే వైసీపీ 133 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందట. అలాగే వైసీపీకి 48% ఓట్ షేర్ టీడీపీ జనసేనకు 44% ఓట్ షేర్ వస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా జనాధర్ ఇండియా సర్వే కూడా వైసీపీ పార్టీకి అధికారం ఖాయమని తెలియజేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం వైసీపీ పార్టీకి 125 సీట్లు , టీడీపీ జనసేన కూటమికి 50 సీట్లు వస్తాయని తెలిపింది. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సర్వేలో కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో వైసీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
This website uses cookies.