
Jagan : జగన్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పిన మరో సర్వే... కూటమి గెలుపు గల్లంతే...
Jagan : ఏపీలో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్ధం సభలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అంతేకాక జగన్ సిద్ధం సభలకు ప్రతి చోట ప్రజలందరూ జననీరాజనం పలుకుతున్నారు. ఇది ఇలా ఉంటే ఒంటరిగా జగన్ ను ఎదుర్కోవడం కష్టమని భావించిన విపక్ష పార్టీలు టీడీపీ జనసేన పోత్తుగా కలిసి ముందుకు వెళుతున్నాయి. ఇక ఈ పొత్తులో బీజేపీ కూడా ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ప్రముఖ జాతీయ సంస్థలు తాజాగా విడుదల చేసిన సర్వేలో కూడా అధికార వైసీపీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయి.
అయితే ఇప్పటికే టైమ్స్ నౌ , ఇండియా టీవీ, ఫుల్ స్ట్రాటజీ , పొలిటికల్ క్రిటిక్ వంటి సంస్థలు చేపట్టిన సర్వేలలో కూడా వైసీపీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అంతేకాక గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలు కూడా వైసీపీ పార్టీని గెలిపించేందుకే సిద్ధమవుతున్నారని సర్వేలో వెళ్లడైంది.
అయితే ఒకవైపు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ఆంధ్ర రాష్ట్రంలో వైసీప పార్టీ చాలా బలంగా ఉందని ఇక ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీకే అధికారం చేపడుతుందంటూ సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా జీ న్యూస్ సంస్థలతో పాటు మరో ప్రముఖ సంస్థ చేసినటువంటి సర్వేలో వచ్చిన ఫలితాలు టీడీపీ మరియు జనసేన నేతలలో గుబులు పుట్టిస్తున్నాయని చెప్పాలి. అయితే తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో జీ న్యూస్ మరియు మ్యాట్రిజ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలలో వైసీపీ పార్టీ 19 స్థానాలను సాధిస్తుందని తెలియజేశాయి. అయితే వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాలు దక్కించుకోగా ఈసారి 3 స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. అదేవిధంగా తెలుగుదేశం మరియు జనసేన కూటమి 6 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేశాయి.
అంతేకాక ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలలో వైసీపీ కాంగ్రెస్ పార్టీపై అసలు వ్యతిరేకత లేదని తెలియజేస్తున్నాయి. అంతేకాక సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి కి వెళ్లి అందిస్తుండడంతో ప్రజలందరూ కూడా జగన్ పాలన పైపే ఆసక్తి చూపిస్తున్నట్లుగా సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే వైసీపీ 133 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందట. అలాగే వైసీపీకి 48% ఓట్ షేర్ టీడీపీ జనసేనకు 44% ఓట్ షేర్ వస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా జనాధర్ ఇండియా సర్వే కూడా వైసీపీ పార్టీకి అధికారం ఖాయమని తెలియజేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం వైసీపీ పార్టీకి 125 సీట్లు , టీడీపీ జనసేన కూటమికి 50 సీట్లు వస్తాయని తెలిపింది. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సర్వేలో కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో వైసీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.
Guava Farming Success Story : ప్రస్తుతం చాలా మంది యువత ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల…
Liquor Prices : తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలోనే భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో లిక్కర్,…
Ration Card : ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి…
Karthika Deepam 2 Today Episode 5 June 2026 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న…
Today Gold Rate : బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి కొంత ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని…
Peddi Day 1 Box Office : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా నటించిన…
Raw Papaya : మన రోజువారీ జీవితంలో అందుబాటులో ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. సాధారణంగా చాలా మంది పండిన…
Crystal Shivling : హిందూ సంప్రదాయంలో శివలింగానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పరమశివుడి నిరాకార స్వరూపానికి ప్రతీకగా భావించే…
Tea : భారతీయుల జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి వేడి…
Chiranjeevi Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలైన మొదటి…
Best Smartphones : స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రతి నెలా కొత్త మోడళ్లు విడుదలవుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎన్నో ఎంపికలు అందుబాటులోకి…
Mango Farmer : మామిడి పండ్లను పండించే రైతులు మంచి దిగుబడి వస్తే సంతోషిస్తారు. కానీ ఒడిశాకు చెందిన ఓ…
This website uses cookies.