
Jagan : ఒక్క సభతో వివేకా హత్యకేసు ఆరోపణలకు ముగింపు పలికిన జగన్..!
Jagan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి అన్ని పార్టీలు ప్రజల వద్దకు వెళ్తున్నాయి. అటుప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో సీఎంగా ఉన్న జగన్ కు గెలుపుకు అవకాశాలు ఎంత ఉంటాయో.. సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన విషయాలు కూడా అన్నే ఉంటాయి. అందులోనూ జగన్ కు పెద్ద టాస్క్ లాగా మారిపోయింది మాత్రం వివేకా హత్య కేసు అనే చెప్పుకోవాలి. చాలా రోజులుగా ప్రతిపక్ష పార్టీలు, అటు వివేకా కూతురు సునీత చేస్తున్న ఆరోపనలకు జగన్ ఇన్ని రోజులు మౌనంగానే ఉండిపోయారు.
కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి. కాబట్టి ప్రతిపక్షాలు, సొంత కుటుంబీకులు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆయన మీద ఈ ఆరోపణలు పీక్స్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఆ విషయం జగన్ కు కూడా బాగా తెలుసు. అందుకే వివేకా హత్య కేసుపై సొంత కడప జిల్లాలోనే తన వివరణ ఇచ్చుకున్నారు జగన్. వివేకా నందరెడ్డిని గతంలో ఇదే టీడీపీ విలన్ గా చూపించిందని.. ఇప్పుడు మాత్రం తన బాబాయ్ హత్య కేసును అడ్డుపెట్టుకుని ఫ్యామిలీతో రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం జగన్.
అక్కడితోనే వివేకా హత్య కేసుపై ఆయన ముగింపు పలికినట్టు అర్థం అవుతోంది. తర్వాత సభలో ఆయన దానిపై మాట్లాడుతారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే జగన్ ఇలా ఒక్క సభతోనే తన బాబాయ్ హత్య కేసు విషయంలో వస్తున్న ఆరోపణలకు ఇలా చెక్ పెట్టేశారు. అంటే తాను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాలని ఇలా మాట్లాడలేదని తెలుస్తోంది. ప్రజలకు తన క్లారిటీ ఇవ్వాలని ఇలా మాట్లాడారని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు జగన్ వెంబడే ఉంది. వైఎస్సార్ చెల్లెళ్లు కూడా జగన్ కే మద్దతు పలుకుతున్నారు.
మొత్తం 750 మంది కుటుంబ సభ్యులు ఉండే వారంతా కూడా జగన్ వెంటే ఉంటున్నారు. అందుకే ఇప్పుడు జగన్ కు ఫ్యామిలీ మద్దతు ఉంది. కాబట్టి ఇప్పుడు తాను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని ఇలా ప్రజలకు ఓ సారి తన వాయిస్ వినిపించి ముగింపు పలికేశారు సీఎం జగన్.
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
This website uses cookies.