Jagan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి అన్ని పార్టీలు ప్రజల వద్దకు వెళ్తున్నాయి. అటుప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో సీఎంగా ఉన్న జగన్ కు గెలుపుకు అవకాశాలు ఎంత ఉంటాయో.. సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన విషయాలు కూడా అన్నే ఉంటాయి. అందులోనూ జగన్ కు పెద్ద టాస్క్ లాగా మారిపోయింది మాత్రం వివేకా హత్య కేసు అనే చెప్పుకోవాలి. చాలా రోజులుగా ప్రతిపక్ష పార్టీలు, అటు వివేకా కూతురు సునీత చేస్తున్న ఆరోపనలకు జగన్ ఇన్ని రోజులు మౌనంగానే ఉండిపోయారు.
కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి. కాబట్టి ప్రతిపక్షాలు, సొంత కుటుంబీకులు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆయన మీద ఈ ఆరోపణలు పీక్స్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఆ విషయం జగన్ కు కూడా బాగా తెలుసు. అందుకే వివేకా హత్య కేసుపై సొంత కడప జిల్లాలోనే తన వివరణ ఇచ్చుకున్నారు జగన్. వివేకా నందరెడ్డిని గతంలో ఇదే టీడీపీ విలన్ గా చూపించిందని.. ఇప్పుడు మాత్రం తన బాబాయ్ హత్య కేసును అడ్డుపెట్టుకుని ఫ్యామిలీతో రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం జగన్.
అక్కడితోనే వివేకా హత్య కేసుపై ఆయన ముగింపు పలికినట్టు అర్థం అవుతోంది. తర్వాత సభలో ఆయన దానిపై మాట్లాడుతారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే జగన్ ఇలా ఒక్క సభతోనే తన బాబాయ్ హత్య కేసు విషయంలో వస్తున్న ఆరోపణలకు ఇలా చెక్ పెట్టేశారు. అంటే తాను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాలని ఇలా మాట్లాడలేదని తెలుస్తోంది. ప్రజలకు తన క్లారిటీ ఇవ్వాలని ఇలా మాట్లాడారని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు జగన్ వెంబడే ఉంది. వైఎస్సార్ చెల్లెళ్లు కూడా జగన్ కే మద్దతు పలుకుతున్నారు.
మొత్తం 750 మంది కుటుంబ సభ్యులు ఉండే వారంతా కూడా జగన్ వెంటే ఉంటున్నారు. అందుకే ఇప్పుడు జగన్ కు ఫ్యామిలీ మద్దతు ఉంది. కాబట్టి ఇప్పుడు తాను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని ఇలా ప్రజలకు ఓ సారి తన వాయిస్ వినిపించి ముగింపు పలికేశారు సీఎం జగన్.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.