Home » Andhra Pradesh » Kapu Leader Mudragada Padmanabham Passes Away
andhra pradesh

Mudragada Padmanabham Away : బ్రేకింగ్ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. ఏపీ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 17, 2026 2:56 pm
Advertisement

Mudragada Padmanabham Away : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ముద్రగడ పద్మనాభం Mudragada Padmanabhamఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా **కాపు ఉద్యమం Kapu Movement లో కూడా ఒక కీలక అధ్యాయం ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న Mudragada Padmanabham హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు, కాపు సంఘాల నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగిన ముద్రగడ రాజకీయ నాయకుడిగానే కాకుండా ఉద్యమనేతగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్లు Kapu Reservations  సాధించాలనే లక్ష్యంతో ఆయన చేసిన ఉద్యమాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి.

Advertisement

Mudragada Padmanabham Away : బ్రేకింగ్ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. ఏపీ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది..!

Mudragada Padmanabham Away కాపు ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన Mudragada Padmanabham

1953 జనవరి 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం Mudragada Padmanabham రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు కూడా ప్రజాప్రతినిధిగా సేవలందించారు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముద్రగడ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజలకు చేరువయ్యారు. తన రాజకీయ జీవితంలో ఆయన మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా (MP) ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు NTR కోట్ల విజయభాస్కర్ రెడ్డి Kotla Vijayabhaskara Reddy మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో పనిచేసిన ఆయన, అనంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) లో చేరి మళ్లీ చురుకైన రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయనకు నిజమైన గుర్తింపు తెచ్చింది Kapu Reservations ఉద్యమమే. కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో అనేకసార్లు నిరాహార దీక్షలు, ప్రజా ర్యాలీలు, ఉద్యమాలు నిర్వహించారు. ఈ పోరాటం కారణంగా ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది.

Advertisement

Mudragada Padmanabham Away ఉద్యమాలు, వివాదాలు, రాజకీయ మలుపులు.. ప్రజల్లో చెరగని ముద్ర

Mudragada Padmanabham రాజకీయ ప్రయాణంలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది 2016లో జరిగిన కాపు ఉద్యమం. తుని ఘటన తర్వాత కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆ సమయంలో ఆయన చేపట్టిన నిరాహార దీక్షలు, ఉద్యమాలు రాజకీయంగా పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఏడు సార్లకు పైగా దీక్షలు చేపట్టిన ఆయన, కాపు వర్గానికి న్యాయం చేయాలనే డిమాండ్‌ను నిరంతరం వినిపించారు. అయితే 2020లో ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల సమయంలో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన **పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి”గా మార్చుకుంటానని ప్రకటించారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో, ఇచ్చిన మాట ప్రకారం తన పేరును అధికారికంగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్‌ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.

ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యలు వేధించినప్పటికీ ప్రజా అంశాలపై ఆయన స్పందిస్తూ వచ్చారు. చివరకు అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూయడంతో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. Mudragada Padmanabham మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం ముగిసిందనే అభిప్రాయం పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజా సమస్యలపై తీసుకున్న వైఖరి, ఉద్యమ నాయకుడిగా చూపిన ధైర్యం రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని నేతలు నివాళులర్పిస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి